Telangana: మంత్రి సబిత గన్‌మన్‌ ఆత్మహత్య

విద్యాశాఖ మంత్రి సబిత ఇంద్రారెడ్డి గన్‌మన్‌ ఏఎస్సై ఫాజిల్‌ ఆత్మహత్య చేసుకున్నాడు. ఆదివారం ఉదయం ఈ ఘటన జరిగింది.

By అంజి  Published on  5 Nov 2023 3:09 AM GMT
Minister Sabitha Indra Reddy, Gunman, suicide, Crime news

Telangana: మంత్రి సబిత గన్‌మన్‌ ఆత్మహత్య

హైదరాబాద్‌: విద్యాశాఖ మంత్రి సబిత ఇంద్రారెడ్డి భద్రతా సిబ్బందిగా పనిచేస్తున్న ఆర్మ్‌డ్‌ రిజర్వ్‌డ్‌ సబ్‌ ఇన్‌స్పెక్టర్‌ ఫాజిల్‌ ఆత్మహత్య చేసుకున్నాడు. ఆదివారం జూబ్లీహిల్స్‌ పోలీస్‌స్టేషన్‌ పరిధిలోని శ్రీనగర్‌ కాలనీలో మణికంఠ హోటల్‌లో ఫాజిల్‌.. తుపాకీతో నుదిటిపై పాయింట్‌ బ్లాంక్‌లో కాల్చుకుని సూసైడ్‌ చేసుకున్నాడు. కూతురుతో మాట్లాడిన తర్వాత ఆత్మహత్యకు పాల్పడ్డారు. ఆదివారం ఉదయం 7 గంటల సమయంలో డ్యూటీలో ఉండగా ఈ ఘటన జరిగింది. పోలీసు ఉన్నతాధికారులు ఘటనాస్థలానికి చేరుకుని దర్యాప్తు చేపట్టారు. ఘటన జరిగిన వెంటనే మంత్రి వారి కుటుంబాన్ని పరామర్శించారు. ఆమె కుమార్తె ప్రకారం, ఫాజిల్ లోన్ యాప్ ఏజెంట్ల నుండి వేధింపులను భరించలేకపోయాడు. ఈ క్రమంలోనే ఫాజిల్‌ సూసైడ్‌ చేసుకున్నట్టు సమాచారం.

వెస్ట్ జోన్ డిసిపి జోయెల్ డేవిస్ నేతృత్వంలోని ప్రాథమిక దర్యాప్తులో.. ఆర్థిక ఇబ్బందులే అతన్ని ఈ విపరీతమైన చర్య తీసుకోవడానికి అతడి ప్రేరేపించాయని తెలపింది. ఆర్థిక ఇబ్బందులపై ఫాజిల్ కుమార్తెతో చర్చించేందుకు ఎస్‌ఐ ఉదయం మంత్రి నివాసానికి సమీపంలోని టిఫిన్ సెంటర్‌ను సందర్శించినట్లు సంబంధిత వర్గాలు తెలిపాయి. ఆమె ప్రకారం.. అతను లోన్ యాప్ ఏజెంట్ల నుండి వేధింపులను తట్టుకోలేకపోయాడు.

"ఎస్‌ఐ రుణం కోసం దరఖాస్తు చేసుకున్నట్లు మా దృష్టికి వచ్చింది. అతను తిరిగి చెల్లింపులకు సంబంధించి వేధింపులను ఎదుర్కొన్నాడా లేదా అని మేము తనిఖీ చేస్తున్నాము" అని జోయెల్ డేవిస్ చెప్పారు. ఆయన మరణవార్త తెలియగానే మంత్రి కుటుంబసభ్యులను పరామర్శించారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఉస్మానియా ఆస్పత్రికి తరలించారు. కేసు నమోదు చేసి, దర్యాప్తు కొనసాగిస్తున్నారు.

Next Story