భార్యాభర్తల గొడవను ఆపబోయి.. భర్తను హతమార్చిన యువకుడు

తమిళనాడులో దారుణ ఘటన చోటు చేసుకుంది. కోయంబత్తూరు జిల్లాలోని పొల్లాచ్చిలో బుధవారం ఒకరిని కొడవలితో నరికి చంపినందుకు ఓ వ్యక్తిని అరెస్టు చేశారు.

By అంజి  Published on  2 Feb 2024 1:26 AM GMT
couple fight, Tamil Nadu, Crime news

భార్యాభర్తల గొడవను ఆపబోయి.. భర్తను హతమార్చిన యువకుడు

తమిళనాడులో దారుణ ఘటన చోటు చేసుకుంది. కోయంబత్తూరు జిల్లాలోని పొల్లాచ్చిలో బుధవారం ఒకరిని కొడవలితో నరికి చంపినందుకు ఓ వ్యక్తిని అరెస్టు చేశారు. ఈ ఘటనకు పోలీసులు తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి. పొల్లాచ్చి సమీపంలోని సింగనల్లూర్‌లోని చిట్టండేశ్వర ఆలయం సమీపంలోని తోటతు రోడ్డులో దంపతులు నివసిస్తున్నారు. దంపతులు రాధాకృష్ణన్ (59), అతని భార్య సరస్వతి (48) మంగళవారం రాత్రి భూమి అమ్మకానికి సంబంధించి గొడవపడ్డారు. స్థలం అమ్మకం విషయంలో ఇద్దరి మధ్య తరచూ గొడవలు జరిగేవి. మళ్లీ వాగ్వాదం జరగడంతో రాధాకృష్ణన్‌కు చెందిన భూమిలో కోళ్ల ఫారాన్ని లీజుకు తీసుకుని నడుపుతున్న శివకుమార్ (36) జోక్యం చేసుకుని గొడవను ఆపేందుకు ప్రయత్నించాడు.

అయితే రాధాకృష్ణన్ శివకుమార్‌పై కొడవలితో దాడి చేయడంతో కుడి చేతికి గాయమైంది. ఆ తర్వాత శివకుమార్ రాధాకృష్ణన్ నుంచి కొడవలి లాక్కొని నరికాడు. దీంతో రాధాకృష్ణ అక్కడికక్కడే మృతి చెందాడు. సమాచారం అందుకున్న అనైమలై పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని రాధాకృష్ణన్ మృతదేహాన్ని స్వాధీనం చేసుకుని పోస్టుమార్టం నిమిత్తం కోయంబత్తూరు ప్రభుత్వాసుపత్రికి తరలించారు. హత్యానేరం కింద కేసు నమోదు చేసి శివకుమార్‌ను అరెస్టు చేశారు. ఈ కేసులో తదుపరి విచారణ కొనసాగుతోందని పోలీసులు తెలిపారు.

Next Story