దొంగ డాక్టర్.. యూకే నుండి వచ్చిన కార్డియాలజిస్ట్ గా నటిస్తూ!!

మధ్యప్రదేశ్‌లోని దామోహ్ జిల్లాలోని ఒక మిషనరీ ఆసుపత్రిలో నకిలీ కార్డియాలజిస్ట్ చికిత్స అందించిన ఏడుగురు మరణించారని ఆరోపణలు నమోదయ్యాయి.

By అంజి
Published on : 6 April 2025 9:30 PM IST

Man posing as British heart surgeon, surgeries, multiple deaths, Madhya Pradesh

దొంగ డాక్టర్.. యూకే నుండి వచ్చిన కార్డియాలజిస్ట్ గా నటిస్తూ!!

మధ్యప్రదేశ్‌లోని దామోహ్ జిల్లాలోని ఒక మిషనరీ ఆసుపత్రిలో నకిలీ కార్డియాలజిస్ట్ చికిత్స అందించిన ఏడుగురు మరణించారని ఆరోపణలు నమోదయ్యాయి. ఈ సంఘటనపై ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేశారు. దీనిపై జాతీయ మానవ హక్కుల కమిషన్ (NHRC) దర్యాప్తును ప్రారంభించింది. ఈ ఆరోపణలను దర్యాప్తు చేయడానికి NHRC బృందం ఏప్రిల్ 7 నుండి 9 వరకు సమయాన్ని కేటాయించారు. UKకి చెందిన ప్రసిద్ధ కార్డియాలజిస్ట్‌గా నటించే ఓ వ్యక్తి ఈ ఘటన వెనుక ఉన్నాడని NHRC సభ్యుడు ప్రియాంక్ కనూంగో తెలిపారు.

స్థానిక వ్యక్తి దీపక్ తివారీ దాఖలు చేసిన ఫిర్యాదులో, డాక్టర్ ఎన్. జాన్ కామ్ అనే వ్యక్తి దామోహ్ మిషన్ హాస్పిటల్‌లోని కార్డియాలజీ విభాగంలో ప్రాక్టీస్ చేస్తున్నట్లు ఆరోపించారు. అయితే ఆ వ్యక్తి నిజమైన గుర్తింపు నరేంద్ర విక్రమాదిత్య యాదవ్ అని, రోగులను మోసం చేయడానికి ప్రఖ్యాత బ్రిటిష్ కార్డియాలజిస్ట్ ప్రొఫెసర్ గా నటించడం మొదలుపెట్టాడని ఫిర్యాదుదారుడు ఆరోపించాడు. యాదవ్ అందించిన తప్పుడు చికిత్స కారణంగా జనవరి, ఫిబ్రవరి 2025 మధ్య పలు మరణాలు సంభవించాయని ఆరోపణలు ఉన్నాయి.

Next Story