జామ్‌న‌గ‌ర్‌లో దారుణం.. నాలుగేళ్ల బాలికపై అత్యాచారం

Man moslated 4 years old girl. గుజరాత్‌లోని జామ్‌నగర్ జిల్లాలో నాలుగేళ్ల బాలికపై 35

By M.S.R  Published on  4 Jan 2023 9:41 AM GMT
జామ్‌న‌గ‌ర్‌లో దారుణం..  నాలుగేళ్ల బాలికపై అత్యాచారం

మైనర్లపై రోజు రోజుకీ లైంగిక వేధింపుల ఘటనలు ఎక్కువవుతూ ఉన్నాయి. గుజరాత్‌లోని జామ్‌నగర్ జిల్లాలో నాలుగేళ్ల బాలికపై 35 ఏళ్ల వ్యక్తి అత్యాచారానికి పాల్పడ్డాడు. నిందితుడిని జామ్‌నగర్ పోలీసులు అరెస్ట్ చేశారు. అతడిని నేపాల్‌కు చెందిన సర్జెన్ అలియాస్ సాజన్ విశ్వకర్మగా గుర్తించారు. ఈ ఘటన ఆదివారం ఉదయం చోటుచేసుకుంది. విశ్వకర్మ తనకు తెలిసిన వ్యక్తిని కలవడానికి హౌసింగ్ సొసైటీకి వెళ్లినట్లు తెలిసింది. అతనికి తెలిసిన వ్యక్తి అక్కడ సెక్యూరిటీ గార్డుగా పని చేస్తూ ఉన్నాడు.

మైనర్ బాలిక తన అమ్మమ్మతో ఆడుతుండగా, 35 ఏళ్ల నిందితుడు ఆ బాలికను చూశాడు. విశ్వకర్మకు అమ్మాయి కుటుంబం గురించి అంతకు ముందే తెలుసు. అనంతరం బాలిక అమ్మమ్మతో గ్లాసు నీళ్లు అడిగాడు. నీరు తీసుకురావడానికి ఆమె లోపలికి వెళ్లగా, నిందితుడు బాలికను చాక్లెట్‌లతో ప్రలోభపెట్టి నిర్జన ప్రదేశానికి తీసుకెళ్లి అత్యాచారానికి పాల్పడ్డాడు.

ఇంటికి తిరిగి వచ్చేసరికి బాలిక ఏడుస్తోంది. ఆమె ప్రైవేట్ పార్ట్‌ల నుండి రక్తం కారడాన్ని ఆమె తండ్రి చూశారు. ఏం జరిగిందని బాలికను అడిగితే, సాజన్ మామా తనను తీసుకెళ్లాడని ఆమె చెప్పిందని సి డివిజన్ పోలీస్ స్టేషన్ ఇన్‌స్పెక్టర్ పిఎల్ వాఘేలా తెలిపారు. దీంతో బాలిక తండ్రి పోలీసులను ఆశ్రయించి నిందితుడిపై ఫిర్యాదు చేశాడు. బాలికను వైద్య పరీక్షల నిమిత్తం జిజి ఆసుపత్రికి కూడా తరలించారు. నిందితుడిని అరెస్టు చేశారు. ఈ కేసుపై పోలీసులు సమగ్ర విచారణ చేపట్టారు.

Next Story