టీ లో మత్తు కలిపి అత్యాచారం.. వీడియో తీసి బెదిరింపు.. చివరికి..

Man molested housekeeper and lady owner recorded video. దేశంలో ప్రతిరోజు ఎక్కడో అక్కడ మహిళలపై అత్యాచారాలు, టీ లో మత్తు కలిపి అత్యాచారం

By తోట‌ వంశీ కుమార్‌  Published on  1 Feb 2021 10:15 AM GMT
Man molested house keeper and lady owner recorded video

దేశంలో ప్రతిరోజు ఎక్కడో అక్కడ మహిళలపై అత్యాచారాలు, హత్యలు జరుగుతూనే ఉన్నాయి. దారుణం ఏంటంటే చిన్న పిల్లలు, వృద్దుల అని కూడా చూడకుండా కామాంధులు పైశాచికంగా రెచ్చిపోతున్నారు. తాజాగా ఓ మహిళకు టీలో మత్తు మంది కలిపి అత్యాచారం చేయడమే కాదు.. దాన్ని వీడియో తీసి డబ్బులు డిమాండ్ చేస్తూ అడ్డంగా బుక్కయ్యారు.. ఈ ఘటన ఖమ్మంలో చోటు చేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం ఖమ్మంలోని టీచర్స్‌ కాలనీకి చెందిన కాల్వ కళావతి ఇంట్లో ఓ మహిళ పనిచేస్తోంది. ఆమె ఇంటికి నలుగురు బంధువులు వచ్చారు. వారి కన్ను ఆ ఇంట్లో పని చేసే పనిమనిషిపై పడింది.

ఇంటి యజమానురాలిని ఒప్పించి పనిమనిషిపై అత్యాచారం చేయడానికి సిద్దమయ్యారు. టీ లో మత్తుమంది కలిపి పనిమనిషికి స్వయంగా ఇంటి యజమానురాలు ఇచ్చింది. మత్తులో ఉన్న ఆమెపై బంధువుల్లో ఒక్కడైన సయ్యద్‌ హుస్సేన్‌ ఆత్యాచారం చేశారు. ఈ తతంగాన్ని ఇంటి యజమానురాలు వీడియో తీసింది. తర్వాత పనిమనిషిని రూ.5 లక్షలు ఇవ్వాలని లేదంటే సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తామని బెదిరించారు. దాంతో ఆమె విసిగిపోయి పోలీసులను ఆశ్రయించింది. కేసు నమోదు చేసుకున్న పోలీసులు.. సయ్యద్‌ హుస్సేన్‌ను అదుపులోకి తీసుకున్నారు. మిగిలిన నలుగురు పరారీలో ఉన్నారు.


Next Story