తెలంగాణలో దారుణం.. కొడుకును పిడిగుద్దులతో చంపిన తండ్రి.. స్కూల్‌ నుండి ఆలస్యంగా వచ్చాడని..

యాదాద్రి భువనగిరి జిల్లాలోని చౌటుప్పల్ పట్టణం ఆరేగూడేంలో దారుణ ఘటన చోటు చేసుకుంది.

By అంజి
Published on : 10 Feb 2025 8:05 AM IST

Man kills son, drunken rage, Yadadri Bhuvanagiri district, Telangana

తెలంగాణలో దారుణం.. కొడుకును పిడిగుద్దులతో చంపిన తండ్రి.. స్కూల్‌ నుండి ఆలస్యంగా వచ్చాడని..

యాదాద్రి భువనగిరి జిల్లాలోని చౌటుప్పల్ పట్టణం ఆరేగూడేంలో దారుణ ఘటన చోటు చేసుకుంది. 14 ఏళ్ల బాలుడు భాను ప్రసాద్‌ని అతని తండ్రి కట్ట సైదులు కొట్టి చంపాడని పోలీసులు ఆదివారం తెలిపారు. తొమ్మిదో తరగతి చదువుతున్న ఆ బాలుడు శనివారం రాత్రి పాఠశాలలో వీడ్కోలు కార్యక్రమానికి హాజరై ఇంటికి తిరిగి వచ్చినప్పుడు ఈ సంఘటన జరిగింది. ఆలస్యంగా ఇంటికి రావడంపై అతనిని తండ్రి ప్రశ్నించాడని వారు తెలిపారు. ఆ తర్వాత ఆ వ్యక్తి తన కొడుకు ఛాతీపై కొట్టాడని చౌటుప్పల్ పోలీసులు ప్రాథమిక దర్యాప్తులో తెలిపారు.

బాలుడిని ఆసుపత్రికి తరలించినప్పటికీ, మార్గమధ్యలోనే అతను మరణించాడని పోలీసులు తెలిపారు. కుటుంబ సభ్యులు మొదట పోస్ట్‌మార్టం నిర్వహించకుండా, అంత్యక్రియలు కొనసాగించడానికి ప్రయత్నించగా, పోలీసులు జోక్యం చేసుకుని మృతదేహాన్ని పరీక్ష కోసం తరలించారు. నిందిత తండ్రి ప్రస్తుతం పోలీసు కస్టడీలో ఉన్నాడు. సంఘటన జరిగిన సమయంలో నిందితుడు మద్యం మత్తులో ఉన్నట్లు పోలీసులు తెలిపారు. బాలుడి తల్లి ఇచ్చిన ఫిర్యాదు ఆధారంగా, నిందితుడిపై హత్య కేసు నమోదు చేశారు. ప్రస్తుతం కేసు తదుపరి దర్యాప్తు జరుగుతోంది.

Next Story