మహారాష్ట్రలోని నాగ్పూర్లో దారుణం జరిగింది. పార్టీకి తక్కువ మద్యం తెచ్చినందుకు ఓ వ్యక్తి తన స్నేహితుడిని హత్య చేశాడని సోమవారం ఒక పోలీసు అధికారి తెలిపారు. ఈ సంఘటన ఆదివారం రాత్రి బాబా బుద్ధజీ నగర్లో జరిగిందని పచ్పావోలి పోలీస్ స్టేషన్ అధికారి తెలిపారు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.
"వైశాలి నగర్లోని తాజ్ నగర్లో నివసిస్తున్న రమేష్ అలియాస్ వైద్య ముకుంద్రావ్ మస్రామ్ (40) ను అతని స్నేహితుడు శంకర్ శ్రీపాద్ భైసారే (48) కొట్టి చంపాడు. ఎక్కువ మొత్తంలో డబ్బు ఇచ్చినప్పటికీ తక్కువ మద్యం తెచ్చాడని కొట్టి చంపాడు. మరో ఇద్దరు కూడా ఈ దారుణ దాడిలో పాల్గొన్నారని ఆయన చెప్పారు" అని ఆయన చెప్పారు. ముగ్గురినీ అరెస్టు చేసినట్లు అధికారి తెలిపారు.