ఆవుపై అత్యాచారానికి పాల్పడిన వ్యక్తి అరెస్ట్

ఛత్తీస్‌గఢ్‌లోని దుర్గ్ జిల్లాలో దారుణ ఘటన వెలుగు చూసంది. ఓ వ్యక్తి కామంతో కళ్లు మూసుకుపోయి ఆవుపై అత్యాచారానికి పాల్పడ్డాడు.

By అంజి  Published on  31 May 2023 6:42 AM GMT
Durg, Jamul police station, Rape, Crime news

ఆవుపై అత్యాచారానికి పాల్పడిన వ్యక్తి అరెస్ట్

ఛత్తీస్‌గఢ్‌లోని దుర్గ్ జిల్లాలో దారుణ ఘటన వెలుగు చూసంది. ఓ వ్యక్తి కామంతో కళ్లు మూసుకుపోయి ఆవుపై అత్యాచారానికి పాల్పడ్డాడు. యాదృచ్ఛికంగా సీసీటీవీలో రికార్డైన ఆవుపై అత్యాచారం చేసిన ఈ దారుణమైన చర్యకు పాల్పడిన హసన్ ఖాన్ అనే వ్యక్తిని పోలీసులు మంగళవారం అరెస్టు చేశారు. “గత రాత్రి పోలీసులు మహారాష్ట్రకు చెందిన నిందితుడిని అరెస్టు చేసి జ్యుడిషియల్ రిమాండ్‌కు పంపారు. ఈ కేసులో తదుపరి చర్యలు చట్టం ప్రకారం తీసుకోబడుతున్నాయి” అని దుర్గ్ సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ (ఎస్పీ) శలభ్ కుమార్ సిన్హా తెలిపారు.

జముల్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఈ ఘటన చోటుచేసుకుందని పోలీసు అధికారి తెలిపారు. ఈ ఘటన 2023 మే 24న జరిగిన సీసీటీవీ ఫుటేజీలో చిక్కిందని, ఈ ఘటన ఫుటేజీ వైరల్‌గా మారడంతో అది వెలుగులోకి వచ్చిందని అధికారి తెలిపారు. ఈ క్రూరమైన చర్య యొక్క వీడియో సోషల్ మీడియాలో వైరల్ కావడంతో విశ్వహిందూ పరిషత్, బజరంగ్ దళ్‌కు చెందిన పలువురు ఆగ్రహించిన సభ్యులు జాముల్ పోలీస్ స్టేషన్‌లో నిందితుడిని అరెస్టు చేయాలని డిమాండ్ చేశారు.

చర్యలు తీసుకోవాలని, నిందితులను అరెస్టు చేయాలని, ఇలాంటి దుర్మార్గపు చర్యకు పాల్పడిన వ్యక్తిపై కేసు నమోదు చేయాలని డిమాండ్ చేశారు. విచారణ ఆధారంగా పోలీసులు నిందితుడు ఢిల్లీకి చెందిన బట్టల వ్యాపారి హసన్ ఖాన్‌గా గుర్తించారు. నిందితుడు ఇక్కడ హౌసింగ్ బోర్డు కాలనీలో నివాసం ఉంటున్నాడు. పోలీసులు ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేసి అతని కోసం వేట ప్రారంభించినట్లు దుర్గ్ ఎస్పీ తెలిపారు. చివరకు అతడిని పోలీసుల అరెస్ట్ చేశారు.

Next Story