విషాదం.. ప్రేమికుల రోజున ప్రేమ జంట ఆత్మహత్య

ప్రేమికుల రోజున విషాదం చోటు చేసుకుంది. ఓ 20 ఏళ్ల యువకుడు, అతని 19 ఏళ్ల ప్రియురాలు ఆత్మహత్య ఒప్పందం కుదుర్చుకుని విషం సేవించి తమ జీవితాలను ముగించారు.

By అంజి  Published on  14 Feb 2024 10:46 AM GMT
Lovers, suicide, Valentine’s Day, UttarPradesh

విషాదం.. ప్రేమికుల రోజున ప్రేమ జంట ఆత్మహత్య

ప్రేమికుల రోజున విషాదం చోటు చేసుకుంది. ఓ 20 ఏళ్ల యువకుడు, అతని 19 ఏళ్ల ప్రియురాలు ఆత్మహత్య ఒప్పందం కుదుర్చుకుని విషం సేవించి తమ జీవితాలను ముగించారు. యువ జంట ఒకరినొకరు వివాహం చేసుకోవాలనుకున్నప్పటికీ, వారి కుటుంబాలు సంబంధాన్ని అంగీకరించడానికి సిద్ధంగా లేకపోవడంతో బుధవారం నాడు ఈ తీవ్ర చర్య తీసుకున్నారు. నివేదికల ప్రకారం, చరఖారీలోని కనేరా గ్రామంలో నివసించే సురేంద్ర సింగ్, పొరుగున నివసించే సీమా అనే అమ్మాయితో ప్రేమ సంబంధం కలిగి ఉన్నాడు. కుటుంబ సభ్యులు వారి వ్యవహారాన్ని గుర్తించడంతో, వారు యువతిని, యువకుడిని మందలించారు. వారి వివాహ ప్రణాళికను వ్యతిరేకించారు.

బుధవారం సురేంద్ర పొలాలకు వెళ్తున్నానని చెప్పి ఉదయం ఆరు గంటలకు ఇంటి నుంచి బయటకు వెళ్లగా, అదే సమయంలో సీమా కూడా ఇంటి నుంచి వెళ్లిపోయింది. సురేంద్ర మొదట సల్ఫాస్ సేవించి సీమకు ఫోన్ చేసి విషయం తెలియజేశాడు. దీని తర్వాత, అమ్మాయి కూడా సల్ఫాస్ సేవించింది. బాధతో ఉన్న సురేంద్రను చూసిన గ్రామస్తులు అతని కుటుంబ సభ్యులకు సమాచారం అందించాడు. అదే సమయంలో యువకుడు జరిగిన మొత్తం విషయాన్ని వారికి వివరించాడు. సీమ, సురేంద్ర బంధువులు వారిని మహోబా జిల్లా ఆసుపత్రికి తరలించగా చికిత్స పొందుతూ వారిద్దరూ మృతి చెందారు. జంట మృతిపై సమాచారం అందిందని, మృతదేహాలను పోస్ట్‌మార్టం నిమిత్తం తరలించి దర్యాప్తు జరుపుతున్నామని చరఖారీ పోలీస్ స్టేషన్ ఇన్‌స్పెక్టర్ గణేష్ ప్రసాద్ తెలిపారు.

Next Story