తండ్రిని చంపిన కొడుకు.. మృతదేహాన్ని 30 ముక్కలుగా నరికి.. బోరుబావిలో పడేసి..

Karnataka Crime news.. Son kills father chops body into more than 30 pieces. శ్రద్ధా తరహా హత్య ఘటన కర్ణాటకలో వెలుగు చూసింది. మద్యం మత్తులో ఉన్న తన తండ్రిని కొడుకు

By అంజి  Published on  13 Dec 2022 10:32 AM GMT
తండ్రిని చంపిన కొడుకు.. మృతదేహాన్ని 30 ముక్కలుగా నరికి.. బోరుబావిలో పడేసి..

శ్రద్ధా తరహా హత్య ఘటన కర్ణాటకలో వెలుగు చూసింది. మద్యం మత్తులో ఉన్న తన తండ్రిని కొడుకు అతి క్రూరంగా హత్య చేశాడు. హత్య అనంతరం మృతదేహాన్ని 30కిపైగా ముక్కలుగా నరికి బోరుబావిలో పడేశాడు. నిందితుడిని విఠల్‌ కులాలి (20)గా పోలీసులు గుర్తించారు. మృతదేహాం ముక్కలను పోస్టుమార్టం నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. బాగల్‌కోట్‌ జిల్లా ముధోలకు చెందిన తండ్రి పరశురామ్‌ కులాలి(54) తరచూ మద్యం సేవిస్తూ తన కుమారుడు విఠల్‌తో రోజూ గొడవ పడేవాడు.

డిసెంబర్ 6న పరశురాం మద్యం తాగి ఇంటికి వచ్చి విఠల్‌తో గొడవకు దిగాడని పోలీసు అధికారులు తెలిపారు. కోపంతో విఠల్ తన తండ్రిని ఇనుప రాడ్‌తో కొట్టాడు. దీంతో తండ్రి పరశురాముడు చనిపోయాడు. హత్యానంతరం విఠల్ మృతదేహాన్ని ముధోల్ శివార్లలోని మంటూరు బైపాస్ సమీపంలోని తన పొలానికి తీసుకెళ్లి బోరుబావిలో పడేయడానికి ప్రయత్నించి విఫలమై తండ్రి మృతదేహాన్ని 30కి పైగా ముక్కలుగా నరికాడు. ఆ తర్వాత గొడ్డలి, మృతదేహం ముక్కలను బోర్‌వెల్‌లోకి విసిరాడు.

ఆ ప్రాంతంలో దుర్వాసన వస్తోందని స్థానికులు ఫిర్యాదు చేయడంతో పోలీసులు విచారణ చేపట్టి నిందితుడిని అరెస్ట్ చేశారు. "నరికిన శరీర భాగాలను బయటకు తీయడానికి జెసిబిని ఉపయోగించారు. వెలికితీసిన శరీర భాగాలను పోస్టుమార్టం కోసం పంపారు. దీనికి సంబంధించి ముధోల పోలీస్ స్టేషన్‌లో కేసు నమోదు చేయబడింది. తదుపరి దర్యాప్తు ప్రారంభించబడింది" అని పోలీసు అధికారులు తెలిపారు.

Next Story