Kamareddy: అత్తమామల వేధింపులు.. తట్టుకోలేక అల్లుడు ఆత్మహత్య

కామారెడ్డి జిల్లాలోని ఉగ్రవాయిలో గురువారం తన అత్తమామల వేధింపులు భరించలేక ఒక వ్యక్తి ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ ఘటన స్థానికంగా కలకలం రేపింది.

By -  అంజి
Published on : 31 Oct 2025 7:10 AM IST

Kamareddy, Harassed, Son-in-Law Died, Suicide

Kamareddy: అత్తమామల వేధింపులు.. తట్టుకోలేక అల్లుడు ఆత్మహత్య

కామారెడ్డి జిల్లాలోని ఉగ్రవాయిలో గురువారం తన అత్తమామల వేధింపులు భరించలేక ఒక వ్యక్తి ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ ఘటన స్థానికంగా కలకలం రేపింది. మృతుడిని పాల్వంచ మండలం వాడికి చెందిన అన్వేష్ రెడ్డి (30) గా గుర్తించారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. అన్వేష్ ఐదు సంవత్సరాల క్రితం మాచారెడ్డి మండలం ఘన్‌పూర్ గ్రామానికి చెందిన ఒక మహిళను వివాహం చేసుకున్నాడు. అతను తన భార్య తల్లిదండ్రులతో నివసించేవాడు.

గత కొన్ని రోజులుగా అతడిని తన భార్య తల్లిదండ్రి వేధింపులకు గురిచేశారని సమాచారం. మృతదేహం గురించి సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి వెళ్లి పరిశీలించారు. ఈ క్రమంలోనే అక్కడ అన్వేష్ తన అత్తమామలు తనను వేధించారని ఆరోపిస్తూ రాసిన సూసైడ్ నోట్‌ను స్వాధీనం చేసుకున్నారు. మృతదేహాన్ని పోస్ట్‌మార్టం కోసం కామారెడ్డిలోని ప్రభుత్వ జనరల్ ఆసుపత్రికి తరలించారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసి పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

Next Story