'నేను స్వర్గంలో ఉన్నా.. ఆస్వాదిస్తున్నా'.. జైలులో హత్య నిందితుడు వీడియో

ఉత్తరప్రదేశ్‌ బరేలీ సెంట్రల్ జైలులో ఉన్న హత్య నిందితుడు సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్‌లో లైవ్ వీడియోను హోస్ట్ చేస్తున్న వీడియో బయటపడింది.

By అంజి  Published on  15 March 2024 1:20 AM GMT
Bareilly Central Jail, murder accused, Uttarpradesh

'నేను స్వర్గంలో ఉన్నా.. ఆస్వాదిస్తున్నా'.. జైలులో హత్య నిందితుడు వీడియో

ఉత్తరప్రదేశ్‌ బరేలీ సెంట్రల్ జైలులో ఉన్న హత్య నిందితుడు సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్‌లో లైవ్ వీడియోను హోస్ట్ చేస్తున్న వీడియో బయటపడిందని, ఈ విషయంపై దర్యాప్తుకు ఆదేశించామని పోలీసులు గురువారం తెలిపారు. విచారణలో దోషులుగా తేలిన వారిపై చర్యలు తీసుకుంటామని తెలిపారు. షాజహాన్‌పూర్‌లోని సదర్ బజార్ పోలీస్ స్టేషన్ ప్రాంతంలో డిసెంబర్ 2, 2019న పట్టపగలు పబ్లిక్ వర్క్స్ డిపార్ట్‌మెంట్ (పిడబ్ల్యుడి) కాంట్రాక్టర్ రాకేష్ యాదవ్ (34)ని కాల్చి చంపినట్లు ఆసిఫ్‌పై ఆరోపణలు ఉన్నాయి. మరో నిందితుడు రాహుల్ చౌదరిపై కూడా యాదవ్‌ను హత్య చేశాడని ఆరోపణలు వచ్చాయి, వీరిద్దరూ ప్రస్తుతం బరేలీ సెంట్రల్ జైలులో ఉన్నారు.

జైలులో ఉన్న హత్య నిందితుడి వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారిందని డిప్యూటీ ఇన్‌స్పెక్టర్ జనరల్ (జైలు) కుంతల్ కిషోర్ తెలిపారు. 2 నిమిషాల నిడివి ఉన్న వీడియోలో, “నేను స్వర్గంలో ఉన్నాను. దానిని ఆస్వాదిస్తున్నాను” అని ఆసిఫ్ చెప్పడం వినిపించింది. సోషల్ మీడియాలో వీడియో చూసిన మృతుడి సోదరుడు గురువారం జిల్లా మేజిస్ట్రేట్ ఉమేష్ ప్రతాప్ సింగ్‌ను కలిసి ఫిర్యాదు లేఖ ఇచ్చాడు. హత్య నిందితులకు జైలులో ప్రత్యేక సౌకర్యాలు కల్పిస్తున్నట్లు లేఖలో పేర్కొన్నారు. తన సోదరుడిని హత్య చేసేందుకు ఇద్దరు నిందితులను మీరట్ నుంచి అద్దెకు తీసుకున్నారని తెలిపారు. ఈ వీడియో చూసిన డీఐజీ కిషోర్ ఫోన్‌లో పీటీఐతో మాట్లాడుతూ.. “ఈ వ్యవహారంపై విచారణ జరుగుతోంది. విచారణ అనంతరం దోషులుగా తేలిన వారిపై చట్టపరమైన చర్యలు తీసుకుంటాం’’ అని తెలిపారు.

Next Story