Hyderabad: ఘోర ప్రమాదం.. బస్సు చక్రాల కింద పడి మహిళ మృతి

అప్పటివరకు సంతోషంగా భర్తతో మాట్లాడుతూ బండి మీద వెళ్తున్న ఓ మహిళ రోడ్డు ప్రమాదంలో భర్త కళ్లేందుటే మృతి చెందిన ఘటన రంగారెడ్డి జిల్లాలో చోటుచేసుకుంది.

By అంజి
Published on : 20 Jun 2025 10:02 AM IST

Hyderabad, woman dies in road accident, Attapur

Hyderabad: ఘోర ప్రమాదం.. బస్సు చక్రాల కింద పడి మహిళ మృతి

అప్పటివరకు సంతోషంగా భర్తతో మాట్లాడుతూ బండి మీద వెళ్తున్న ఓ మహిళ రోడ్డు ప్రమాదంలో భర్త కళ్లేందుటే మృతి చెందిన ఘటన రంగారెడ్డి జిల్లాలో చోటుచేసుకుంది. ఈ ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి. రాజేంద్రనగర్‌లో పీవీఎన్ఆర్ పిల్లర్ 198 వద్ద ఆర్టీసీ బస్సు అత్యంత వేగంగా వచ్చే ఓ ద్విచక్ర వాహనాన్ని ఢీ కొట్టింది. దీంతో ద్విచక్ర వాహనం పైన ప్రయాణం చేస్తున్న మహిళ బస్సు చక్రాల కింద పడి నలిగిపోయి అక్కడికక్కడే మరణించింది. అదే బైక్ మీద ప్రయాణం చేస్తున్న భర్త, కూతురికి స్వల్ప గాయాలయ్యాయి.

భార్య భర్తలు, వారి కూతురు కలిసి బైక్ మీద మైహదీపట్నం నుండి రాజేంద్రనగర్ వైపు వెళ్తుండగా ఈ ప్రమాదం సంభవించింది. సమాచారం అందుకున్న వెంటనే పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ప్రభుత్వ హాస్పిటల్ కి తరలించారు. తీవ్ర గాయాలపాలైన తండ్రి కూతుర్లను చికిత్స నిమిత్తం స్థానిక హాస్పిటల్ కి తరలించారు. తన భార్య గర్భవతి అని భర్త రోదిస్తూ చెప్పాడు. ఘటన జరిగిన పరిసర ప్రాంతాల్లో ఉన్న సిసి కెమెరాలను ఆధారంగా చేసుకుని కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.

Next Story