Hyderabad: కూకట్‌పల్లిలో ఒకే రోజు ఇద్దరు ఆత్మహత్య

హైదరాబాద్: కూకట్‌పల్లిలో వేర్వేరు ఘటనల్లో ఇద్దరు ఆత్మహత్యకు పాల్పడ్డారు. మొదటి కేసులో కృష్ణ చైతన్య అనే 36 ఏళ్ల వ్యక్తి..

By అంజి
Published on : 30 Jan 2025 3:06 AM

Hyderabad, Two Died, Suicide, Kukatpally

Hyderabad: కూకట్‌పల్లిలో ఒకే రోజు ఇద్దరు ఆత్మహత్య 

హైదరాబాద్: కూకట్‌పల్లిలో వేర్వేరు ఘటనల్లో ఇద్దరు ఆత్మహత్యకు పాల్పడ్డారు. మొదటి కేసులో కృష్ణ చైతన్య అనే 36 ఏళ్ల వ్యక్తి బుధవారం వివేకానంద కాలనీలోని తన నివాసంలో కుటుంబ సమస్యలతో తన జీవితాన్ని ముగించుకున్నాడు. అతని భార్య, ఇద్దరు పిల్లలు డ్యాన్స్ క్లాస్‌ కోసం బయటకు వెళ్లినప్పుడు, అతను విపరీతమైన స్టెప్ వేశాడు. తిరిగి వచ్చి చూడగా డోర్ లాక్ చేసి ఉంది. డోర్ తెరిచి చూడగా అతడు ఆత్మహత్య చేసుకుని కనిపించాడు. బీఎన్‌ఎస్‌ఎస్ సెక్షన్ 194 కింద కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. ఆర్థిక ఇబ్బందుల కారణంగానే ఆత్మహత్యకు పాల్పడినట్టు పోలీసులు అనుమానిస్తున్నారు. కృష్ణ చైతన్య స్వస్థలం ఆంధ్రప్రదేశ్‌లోని కృష్ణా జిల్లా ఉయ్యూరు. కృష్ణ చైతన్య రెడ్డి గత కొన్ని సంవత్సరాల క్రితం నగరానికి వలస వచ్చి జేసీబీలు కొనుగోలు చేసి వ్యాపారం నిర్వహించాడు.

రెండవ కేసులో.. నబిన్‌ అనే యువకుడు కూకట్‌పల్లిలోని తన నివాసంలో సంబంధాల సమస్యల కారణంగా ఆత్మహత్యకు పాల్పడ్డాడు. తల్లిదండ్రులు ఉద్యోగానికి వెళ్లిన తర్వాత ఆత్మహత్యకు పాల్పడ్డాడు. నేపాల్​ నుంచి నగరానికి వలస వచ్చిన నబీన్​ బికే(17) శంషీగూడ, మహంకాళినగర్​లో తన కుటుంబ సభ్యులతో కలిసి నివాసం ఉంటున్నాడు. నబీన్​ కూకట్​పల్లిలోని ఓ ఫాస్ట్​ ఫుడ్​ సెంటర్​లో పని చేస్తుండగా తల్లిదండ్రులు ఓ రెస్టారెంట్​లో హౌస్​కీపింగ్​ కార్మికులుగా పని చేస్తున్నారు. బుధవారం మధ్యాహ్నం ఇంటికి వచ్చిన నబీన్​ ఇంట్లోని ఫ్యాన్​కు ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. రోజులాగే సాయంత్రం ఇంటికి తిరిగి వచ్చిన నబీన్​ తండ్రి తలుపు తెరిచి చూడగా ఉరివేసుకుని వేలాడుతూ కనిపించాడు. సమాచారం అందుకున్న కూకట్​పల్లి పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని నబీన్​ మృతదేహాన్ని గాంధీ ఆస్పత్రికి తరలించారు.

Next Story