Hyderabad: ఆగివున్న లారీని ఢీకొట్టిన బైక్‌.. ట్రాఫిక్‌ కానిస్టేబుల్‌ మృతి

హయత్‌నగర్ వద్ద శుక్రవారం రోడ్డుపై ఆగి ఉన్న లారీని తన మోటార్‌సైకిల్‌తో ఢీకొట్టడంతో ఒక ట్రాఫిక్ కానిస్టేబుల్ మృతి చెందాడు.

By అంజి
Published on : 20 Jun 2025 12:48 PM IST

Hyderabad, Traffic constable, motorcycle, lorry

Hyderabad: ఆగివున్న లారీని ఢీకొట్టిన బైక్‌.. ట్రాఫిక్‌ కానిస్టేబుల్‌ మృతి

హైదరాబాద్: హయత్‌నగర్ వద్ద శుక్రవారం రోడ్డుపై ఆగి ఉన్న లారీని తన మోటార్‌సైకిల్‌తో ఢీకొట్టడంతో ఒక ట్రాఫిక్ కానిస్టేబుల్ మృతి చెందాడు. రమావత్ మాన్ సింగ్ అనే ఆ పోలీసు యాదాద్రి ట్రాఫిక్ పోలీస్ స్టేషన్‌లో విధులు నిర్వహించేవాడు. శుక్రవారం ఉదయం, మాన్ సింగ్ తన పల్సర్ బైక్‌పై యాదాద్రి నుండి హయత్‌నగర్‌లోని తొర్రూర్ గ్రామానికి వెళుతుండగా, పసుమాముల గ్రామం వద్దకు చేరుకునేసరికి, ఆగి ఉన్న టిప్పర్ లారీని ఢీకొట్టడంతో తీవ్ర గాయాలపాలై అక్కడికక్కడే మరణించాడు.

టిప్పర్ లారీ డ్రైవర్ ఎటువంటి హెచ్చరిక సూచికలు లేకుండా వాహనాన్ని ఆపాడని, చీకటి కారణంగా మాన్ సింగ్ లారీని గమనించలేక వాహనాన్ని ఢీకొట్టాడని హయత్‌నగర్ పోలీసులు తెలిపారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. ఇదిలా ఉంటే.. పశ్చిమబెంగాల్‌ లో ఘోర రోడ్డుప్రమాదం చోటు చేసుకుంది. బొలేరో వాహనం ట్రక్కును ఢీ కొట్టింది. ఈ ఘటనలో తొమ్మిది మంది మృతి చెందారు. పురులియా జిల్లాలో శుక్రవారం ఉదయం ఈ ఘటన చోటు చేసుకుంది.

Next Story