Hyderabad: నగల దుకాణంలో దోపిడీ.. యాజమాని కొడుకును కత్తితో బెదరించి..

అక్బర్‌బాగ్‌లోని నగల దుకాణంలో బుధవారం మధ్యాహ్నం ముగ్గురు ముసుగులు ధరించిన వ్యక్తులు చొరబడి 150 గ్రాముల బంగారం దోచుకెళ్లారు.

By అంజి  Published on  15 Feb 2024 2:37 AM GMT
Hyderabad, Theft, jewelery shop, Akbarbagh, gold

Hyderabad: నగల దుకాణంలో దోపిడీ.. యాజమాని కొడుకును కత్తితో బెదరించి..

హైదరాబాద్‌: అక్బర్‌బాగ్‌లోని నగల దుకాణంలో బుధవారం మధ్యాహ్నం ముగ్గురు ముసుగులు ధరించిన వ్యక్తులు చొరబడి 150 గ్రాముల బంగారం దోచుకెళ్లారు. దుకాణం యజమాని కుమారుడు అడ్డుకునే ప్రయత్నం చేయగా, నిందితులు అతడిని కత్తితో బెదిరించి దాడికి పాల్పడ్డారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. అక్బర్ బాగ్‌లోని గవర్నమెంట్ ప్రెస్ సమీపంలో మహమ్మద్ ఉర్ రెహ్మాన్ నగల దుకాణం నిర్వహిస్తున్నాడు. బుధవారం మధ్యాహ్నం, అతను కొన్ని పనులకు హాజరవుతుండగా దుకాణం చూసుకోవాలని తన కుమారుడు షాజీ ఉర్ రెహ్మాన్‌ను కోరాడు.

మధ్యాహ్నం 1:30 గంటల ప్రాంతంలో ముగ్గురు ముసుగులు ధరించిన వ్యక్తులు బలవంతంగా దుకాణంలోకి ప్రవేశించి షాజీ ఉర్ రెహ్మాన్‌పై దాడి చేశారు. అనంతరం షాజీ ఉర్ రెహ్మాన్ స్పృహ కోల్పోవడంతో వారు నగలతో పరారయ్యారు. స్థానికులు చాదర్‌ఘాట్ పోలీసులకు సమాచారం అందించారు, వారు డాగ్ స్క్వాడ్, క్లూస్ టీమ్‌తో సంఘటనా స్థలానికి చేరుకుని దర్యాప్తు ప్రారంభించారు.

చాదర్‌ఘాట్‌లోని స్టేషన్ హౌస్ ఆఫీసర్ (ఎస్‌హెచ్‌ఓ) వై ప్రకాష్ రెడ్డి మాట్లాడుతూ.. నిందితులు మోటారుసైకిల్‌పై ప్రయాణిస్తూ, మధ్యాహ్నం ప్రార్థన సమయం కారణంగా దుకాణంలో కొద్దిపాటి బయటి పనులతో షాపు యాజమాని ఒంటరిగా ఉండటాన్ని గమనించి, దోపిడీకి దారితీసినట్లు తెలిపారు. "దోపిడీలో ముగ్గురు వ్యక్తుల ప్రమేయం ఉన్నట్టు సిసిటివి ఫుటేజీ వెల్లడించింది. కేసు నమోదు చేయబడింది. అనుమానితులను పట్టుకోవడానికి ప్రత్యేక బృందాలను నియమించాం" అని వై ప్రకాష్ రెడ్డి చెప్పారు.

Next Story