హైదరాబాద్: మేడ్చల్ జిల్లా ఘట్కేసర్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఘోర రోడ్డు ప్రమాదం సంభవించింది. ఈ ప్రమాదంలో ఇద్దరు యువకులు అక్కడికక్కడే మరణించారు. ఎదులాబాద్లో అర్ధరాత్రి సమయంలో ఓ కారు అత్యంత వేగంగా వచ్చి విద్యుత్ స్తంభాన్ని ఢీ కొట్టింది. ఈ ఘటనలో ఆ కారులో ప్రయాణిస్తున్న ఇద్దరు యువకులకు తీవ్ర గాయాలై అక్కడికక్కడే ప్రాణాలు విడిచారు. విషయం తెలుసుకున్న వెంటనే పోలీసులు ఘటన స్థలానికి చేరుకొని కారులో ప్రయాణించిన వారిని భార్గవ్ యాదవ్, వర్షిత్, ప్రవీణ్, దినేష్ గుర్తించారు. భార్గవ్ యాదవ్, వర్షిత్లు అక్కడికక్కడే మృతి చెందారు.
డ్రైవింగ్ చేస్తున్న ప్రవీణ్ కు తీవ్ర గాయాలు కావడంతో చికిత్స కోసం ఆస్పత్రికి తరలించారు. మృతదేహలను గాంధీ మార్చురీకి తరలించారు. దినేష్ కు ఎలాంటి గాయాలు కాలేదు. వీరంతా ఎదులాబాద్ లోని విహారి ఫామ్ హౌస్లో బస చేసినట్లు సమాచారం. అర్ధరాత్రి 2గంటల సమయంలో ఎదులాబాద్ నుండి మేడారం క్రాస్ కు వస్తుండగా ఈ సంఘటన జరిగింది. మృతులు సాఫ్ట్వేర్ ఉద్యోగులుగా పని చేశారు మద్యం సేవించి ఆ మత్తులో ర్యాష్ డ్త్రెవింగ్ చేయడం వల్లే ఈ ప్రమాదం జరిగిందని పోలీసులు ప్రాథమికంగా నిర్దారించారు. ఘటన జరిగిన పరిసర ప్రాంతాల్లో ఉన్న సీసీటీవీ ఫుటేజ్ ను ఆధారంగా చేసుకుని కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. మరిన్ని పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.