కొన్ని రోజుల క్రితం తన నివాసంలో తన ప్రియుడిచే లైంగిక వేధింపులకు, క్రూరమైన దాడికి గురైన 19 ఏళ్ల బాలిక.. ఆమె అనుభవించిన గాయాల ఫలితంగా శుక్రవారం మరణించిందని పోలీసులు తెలిపారు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. బాలిక సోమవారం నాడు చొట్టనిక్కరలోని తన ఇంట్లో తీవ్రంగా గాయపడిన స్థితిలో కనుగొనబడింది. అదే రోజు కొచ్చిలోని ఒక ప్రైవేట్ ఆసుపత్రిలో చేర్చబడింది. వెంటిలేటర్ మద్దతుపై ఉంది. అయితే " ఆస్పత్రిలో చికిత్స పొందుతూ ఆమె శుక్రవారం మధ్యాహ్నం మరణించింది," ఒక పోలీసు అధికారి చెప్పారు.
ఇరవై ఏళ్ల వయసున్న ప్రియుడిని బుధవారం అరెస్టు చేశారు. విచారణ, పోస్ట్మార్టం పూర్తయ్యాక, సంబంధిత వైద్యుల వాంగ్మూలాన్ని నమోదు చేసిన తర్వాత నిందితుడిపై ఇప్పుడు హత్య కేసు నమోదు చేయవచ్చని చొట్టనిక్కర పోలీస్ స్టేషన్ అధికారి తెలిపారు. మొదట, బాధితురాలి తల్లి ఫిర్యాదుపై వ్యక్తిపై భారతీయ న్యాయ సంహితలోని సంబంధిత నిబంధనల ప్రకారం శారీరక దాడి, లైంగిక వేధింపుల కేసు నమోదు చేయబడింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. జనవరి 26 ఆదివారం రాత్రి బాధితురాలి ఇంటికి వెళ్లానని, వారి మధ్య గొడవ జరిగిందని అంగీకరించాడు.