జహీరాబాద్​లో వివాహితపై సామూహిక అత్యాచారం.. మత్తు మందు ఇచ్చి..

Gang rape of a married woman in Zaheerabad. తెలంగాణలోని సంగారెడ్డి జిల్లా జహీరాబాద్‌లో దారుణం జరిగింది. జహీరాబాద్-డిడిగి శివారులో వివాహిత(24) పై సామూహిక

By అంజి  Published on  25 Sep 2022 10:22 AM GMT
జహీరాబాద్​లో వివాహితపై సామూహిక అత్యాచారం.. మత్తు మందు ఇచ్చి..

తెలంగాణలోని సంగారెడ్డి జిల్లా జహీరాబాద్‌లో దారుణం జరిగింది. జహీరాబాద్-డిడిగి శివారులో వివాహిత(24) పై సామూహిక అత్యాచారం చేశారు. ఈ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. సికింద్రాబాద్ తిరుమలగిరి నుంచి ఆటోలో వివాహితని జహీరాబాద్-డిడిగి శివారులోకి తీసుకొచ్చి అఘాయిత్యం చేశారు. శనివారం ఉదయం వివాహిత మత్తులో అచేతన స్థితిలో పడి ఉండటాన్ని గుర్తించిన ఓ వ్యక్తి.. ఆమెను జహీరాబాద్ పోలీస్ స్టేషన్లో అప్పగించారు. వివాహితకి మత్తుమందు ఇచ్చి దుండగులు తీసుకొచ్చినట్లు పోలీసులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. ఈ ఘటనను గోప్యంగా ఉంచి జహీరాబాద్‌ పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. ఈ ఘటనకు సంబంధించిన వివరాలు వెల్లడించేందుకు జహీరాబాద్ డిఎస్పి రఘు నిరాకరించారు.

ఇదిలా ఉంటే.. రంగారెడ్డి జిల్లా మైలార్ దేవ్‌పల్లిలో తొమ్మిదేళ్ల బాలికపై అదే ప్రాంతంలో నివాసం ఉంటున్న బీహార్​కి చెందిన దేవదాస్​ అనే యువకుడు అత్యాచారం చేశాడు. బాలిక తల్లిదండ్రులు ఈ విషయమై పోలీసులకు ఫిర్యాదు చేశారు. బాలిక గత రెండు నెలలుగా అనారోగ్యంతో బాధపడుతున్నట్లు గమనించిన తల్లీదండ్రులు బాలికను ఆరాతీయగా ఏడుస్తూ వివరించింది. తల్లిదండ్రులు పనికి వెళ్లిన సమయంలో ఇంటి పక్కనే ఉన్న దేవదాస్​ తరచు అత్యాచారం చేసినట్లు బాలిక తల్లిదండ్రులకు వివరించింది.

Next Story