విషాదం.. ఇంట్లో చెలరేగిన మంటలు.. ఐదుగురు అగ్నికి ఆహుతి

Five of family killed in house fire in Kerala. కేరళలో రాష్ట్రంలో విషాద ఘటన చోటు చేసుకుంది. మార్చి 8, మంగళవారం నాడు వర్కలాలో ఒక ఇంట్లో జరిగిన అగ్నిప్రమాదంలో

By అంజి  Published on  8 March 2022 3:55 AM GMT
విషాదం.. ఇంట్లో చెలరేగిన మంటలు.. ఐదుగురు అగ్నికి ఆహుతి

కేరళలో రాష్ట్రంలో విషాద ఘటన చోటు చేసుకుంది. మార్చి 8, మంగళవారం నాడు వర్కలాలో ఒక ఇంట్లో జరిగిన అగ్నిప్రమాదంలో ఒకే కుటుంబానికి చెందిన ఐదుగురు వ్యక్తులు మరణించారు. మంగళవారం తెల్లవారుజామున 1.45 గంటల ప్రాంతంలో దలవపురంలోని ఓ కుటుంబం యొక్క ఇల్లు అగ్నికి ఆహుతైంది. మృతులు ప్రతాపన్ (62), షెర్లీ (53), అభిరామి (25), అఖిల్ (29), అభిరామి ఎనిమిది నెలల కుమారుడు రియాన్. ప్రతాపన్ కూరగాయలు వ్యాపారి. కొంతకాలంగా వర్కాలలో వ్యాపారం చేస్తున్నాడు.

తీవ్ర గాయాలపాలైన ప్రతాపన్ పెద్ద కుమారుడు నిహుల్ ప్రస్తుతం చికిత్స పొందుతున్నాడు. మంటలను గమనించిన ఇరుగుపొరుగు వారు వెంటనే అగ్నిమాపక సిబ్బందికి సమాచారం అందించారు. అగ్ని ప్రమాదంలో కనీసం ఐదు బైక్‌లను కాలిపోవడంతో పాటు ఇంట్లోని ఎయిర్ కండిషనర్లు కూడా ధ్వంసమయ్యాయి. ప్రస్తుతానికి ఎలాంటి నిర్ధారణకు రాలేమని అధికారులు తెలిపారు. ఫోరెన్సిక్ నిపుణులు స్థలాన్ని పరిశీలించిన తర్వాత అన్ని కోణాల్లో విచారణ జరుపుతామని రూరల్ సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ (ఎస్పీ) దివ్య గోపీనాథ్ తెలిపారు.

Next Story