ట్రాక్ట‌ర్‌ను ఢీ కొట్టిన ట్ర‌క్కు.. ఐదుగురు దుర్మ‌ర‌ణం.. మృతుల కుటుంబాల‌కు రూ.2ల‌క్ష‌ల ఎక్స్‌గ్రేషియా

Five killed 17 injured in tractor truck collision in Chhattisgarh.ఛత్తీస్‌గఢ్ రాష్ట్రంలో ఘోర రోడ్డు ప్ర‌మాదం జ‌రిగింది.

By తోట‌ వంశీ కుమార్‌  Published on  16 March 2022 4:29 AM GMT
ట్రాక్ట‌ర్‌ను ఢీ కొట్టిన ట్ర‌క్కు.. ఐదుగురు దుర్మ‌ర‌ణం.. మృతుల కుటుంబాల‌కు రూ.2ల‌క్ష‌ల ఎక్స్‌గ్రేషియా

ఛత్తీస్‌గఢ్ రాష్ట్రంలో ఘోర రోడ్డు ప్ర‌మాదం జ‌రిగింది. ఈ ఘ‌ట‌న‌లో ఐదుగురు దుర్మ‌ర‌ణం చెంద‌గా.. మ‌రో 17 మంది తీవ్రంగా గాయ‌ప‌డ్డారు. వివ‌రాల్లోకి వెళితే.. మంగ‌ళ‌వారం రాత్రి గ‌రియాబంద్ జిల్లాలో జోబా వద్ద వేగంగా వెలుతున్న ట్ర‌క్కు.. ట్రాక్ట‌ర్‌ ట్రాలీని ఢీ కొట్టింది. ఈ ఘ‌ట‌న‌లో ఐదుగురు అక్క‌డిక‌క్క‌డే మృతి చెంద‌గా.. మ‌రో 17 మంది గాయ‌ప‌డ్డారు. స‌మాచారం అందుకున్న పోలీసులు వెంట‌నే ఘ‌ట‌నాస్థ‌లానికి చేరుకుని క్ష‌త‌గాత్రుల‌ను చికిత్స నిమిత్తం రాయ‌పూర్ ఆస్ప‌త్రికి త‌ర‌లించారు. ఓ వేడుక‌కు హాజ‌రై తిరిగి ఇంటికి ట్రాక్ట‌ర్ ట్రాలీలో వెలుతుండ‌గా ఈ ఘ‌ట‌న జ‌రిగిన‌ట్లు బాధితులు తెలిపారు.దీనిపై కేసు న‌మోదు చేసిన పోలీసులు ద‌ర్యాప్తు చేప‌ట్టారు.

కాగా.. ఈ ఘ‌ట‌న‌పై ఛ‌త్తీస్‌గ‌ఢ్ సీఎం భూపేష్ బఘేల్ తీవ్ర దిగ్భ్రాంతిని వ్య‌క్తం చేశారు. మృతుల కుటుంబాల‌కు రూ.2ల‌క్ష‌ల చొప్పున ఎక్స్‌గ్రేషియా ప్ర‌క‌టించారు. క్ష‌త‌గాత్రుల‌కు రూ.50 వేల చొప్పున అందించ‌నున్న‌ట్లు తెలిపారు. గాయ‌ప‌డిన వారికి మెరుగైన వైద్యం అందించాల‌ని జిల్లా అధికారుల‌ను ఆదేశించారు.

Next Story