బస్సు రివర్స్ తీస్తుండగా.. దూసుకొచ్చిన లారీ

రంగారెడ్డి జిల్లా షాద్‌నగర్‌ వద్ద ఆర్టీసీ బస్సును వెనుక నుంచి ట్రక్కు ఢీకొనడంతో ఐదుగురు గాయపడ్డారు.

By Kalasani Durgapraveen
Published on : 24 Nov 2024 6:44 PM IST

బస్సు రివర్స్ తీస్తుండగా.. దూసుకొచ్చిన లారీ

రంగారెడ్డి జిల్లా షాద్‌నగర్‌ వద్ద ఆర్టీసీ బస్సును వెనుక నుంచి ట్రక్కు ఢీకొనడంతో ఐదుగురు గాయపడ్డారు. టీఎస్‌ఆర్‌టీసీకి చెందిన బస్సు హైదరాబాద్‌ నుంచి ఆత్మకూర్‌కు వెళ్తుండగా రాయికల్‌ టోల్‌ప్లాజా వద్దకు రాగానే డ్రైవర్‌ బస్సును రివర్స్‌ తీశాడు. ఇది గమనించని లారీ డ్రైవర్‌ బస్సును వెనుక నుంచి ఢీకొట్టాడు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని క్షతగాత్రులను ఆస్పత్రికి తరలించారు. కేసు నమోదైంది.

బస్సు రివర్స్ తీస్తుండగా లారీ వేగంగా రావడంతోనే ఈ ప్రమాదం జరిగిందని స్థానికులు తెలిపారు. బస్సు డ్రైవర్, కండక్టర్ తో పాటు పలువురు ప్రయాణికులకు గాయాలు అయ్యాయి. ఈ ఘటనపై పోలీసులు విచారణ చేస్తున్నారు.

Next Story