నారాయణపేట జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం.. ముగ్గురు మృతి

నారాయణపేట జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. అతివేగంగా వచ్చిన డీసీఎం వాహనం.. లారీని ఢీకొట్టింది. దీంతో ముగ్గురు అక్కడికక్కడే మృతిచెందారు.

By అంజి
Published on : 20 Oct 2023 11:26 AM IST

road accident, Narayanapet, Makthal

నారాయణపేట జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం.. ముగ్గురు మృతి

నారాయణపేట జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. అతివేగంగా వచ్చిన డీసీఎం వాహనం.. లారీని ఢీకొట్టింది. దీంతో డీసీఎం వాహనంలో ఉన్న ముగ్గురు అక్కడికక్కడే మృతిచెందారు. ఈ ఘటన శుక్రవారం నాడు ఉదయం మక్తల్‌ మండలం బొందలకుంట రోడ్డుపై జరిగింది. ఈ ఘటనలో పలువురు గాయపడ్డారు. స్థానికుల ద్వారా విషయం తెలుసుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. క్షతగాత్రులను ఆస్పత్రికి తరలించారు. ప్రమాదానికి కారణమైన వాహనం గురించి తెలుసుకోవడానికి సీసీటీవీ ఫుటేజీలను పరిశీలిస్తున్నారు. ఈ ఘటనపై కేసు నమోదుచేసి దర్యాప్తు చేస్తున్నారు.

మృతులు కర్ణాటకలోని చిక్‌మంగళూరుకు చెందిన వారిగా పోలీసులు గుర్తించారు. ఈ ఘటనకు సంబంధించి మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది. ఇదిలా ఉంటే.. బుల్లెట్‌ బండిపై వేగంగా వెళుతూ ఎదురుగా వస్తున్న మోటార్‌ సైకిల్‌ను ఢీకొట్టి ఒక యువకుడు దుర్మరణం పాలయ్యాడు. ఈ ఘటన కాకినాడ జిల్లాలో చోటు చేసుకుంది. నడకుదురు, పెనుగుదురు గ్రామాల మధ్య ఆర్టీసీ బస్సును తప్పించే ప్రయత్నంలో ఎదురుగా వస్తున్న మోటార్‌ సైకిల్‌ను బలంగా ఢీకొట్టాడు. ఈ ప్రమాదంలో బుల్లెట్‌పై వెళుతున్న వీరేంద్ర తలకు బలమైన గాయమై అక్కడికక్కడే మృతి చెందాడు.

Next Story