మాజీ భర్తను చంపి.. మృతదేహాన్ని ముక్కలు ముక్కలుగా నరికి, ఇసుకలో పాతిపెట్టిన భార్య

చెన్నైలో గ్రౌండ్ ఎయిర్‌పోర్ట్ సిబ్బందిగా పనిచేస్తున్న వ్యక్తిని తమిళనాడులోని పుదుకోట్టైలో అతని భార్య హత్య చేసింది.

By అంజి  Published on  5 April 2023 7:00 AM GMT
Tamil Nadu, Crime news, Chennai

మాజీ భర్తను చంపి.. మృతదేహాన్ని ముక్కలు ముక్కలుగా నరికి, ఇసుకలో పాతిపెట్టిన భార్య 

చెన్నైలో గ్రౌండ్ ఎయిర్‌పోర్ట్ సిబ్బందిగా పనిచేస్తున్న వ్యక్తిని తమిళనాడులోని పుదుకోట్టైలో అతని భార్య హత్య చేసింది. వ్యక్తి మృతదేహాన్ని ముక్కలుగా నరికి, రవాణా చేసి కోవలం వద్ద ఇసుకలో పాతిపెట్టినట్లు పోలీసులు తెలిపారు. భాగ్యలక్ష్మిగా గుర్తించబడిన మహిళను, ఆమె స్నేహితుడిని పోలీసులు అరెస్టు చేశారు. పోలీసులు ఇంకా పాతిపెట్టబడిన మృతుడి శరీర భాగాలను తిరిగి పొందలేదు. విల్లుపురం నివాసి అయిన జయందన్ అనే బాధితుడు తన సోదరితో కలిసి నంగనల్లూరులో నివసిస్తున్నాడు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. మార్చి 18న స్వగ్రామానికి వెళ్తున్నానని సోదరికి చెప్పి ఇంటి నుంచి వెళ్లిపోయాడు.

అయితే, అతను అక్కడికి చేరుకోలేదు. ఆ తర్వాత అతని ఫోన్ స్విచ్ఛాఫ్‌లో ఉంది. అతని సోదరి మార్చి 21న పోలీసులకు మిస్సింగ్ ఫిర్యాదు చేసింది. జయందన్ కాల్ రికార్డుల స్కానింగ్ సెమ్మలంపాటికి చెందిన 39 ఏళ్ల భాగ్యలక్ష్మి వద్దకు దారితీసింది. మరో స్నేహితుడి సాయంతో జయందన్‌ను హత్య చేసి, మృతదేహాన్ని ముక్కలుగా నరికినట్లు భాగ్యలక్ష్మి అంగీకరించినట్లు పోలీసు వర్గాలు తెలిపాయి. కమర్షియల్ సెక్స్ వర్కర్ అయిన జయంధన్, భాగ్యలక్ష్మి చాలా సంవత్సరాల క్రితం తాంబరంలోని ఒక హోటల్‌లో కలుసుకున్నారు.

తరువాత 2020లో ఒక దేవాలయంలో వివాహం చేసుకున్నారు. కానీ ఈ జంట 2021లో విడిపోయారు. మార్చి 19న జయందన్‌ తనను చూసేందుకు వచ్చాడని, వారిద్దరి మధ్య వాగ్వాదం జరిగి హత్యకు దారితీసిందని భాగ్యలక్ష్మి తెలిపింది. భాగ్యలక్ష్మి తన మాజీ భర్త శరీర భాగాలను నరికి సూట్‌కేస్‌లో, గోనె సంచిలో తీసుకెళ్లిందని పోలీసులు తెలిపారు. కోవలం సమీపంలోని నగర శివార్లలో శరీర భాగాలను పాతిపెట్టడానికి ఆమె రెండు సార్లు వెళ్లింది. ఛిద్రమైన వ్యక్తి శరీర భాగాలను ఇంకా బయటకు తీయాల్సి ఉంది.

Next Story