వరంగల్ జిల్లాలో విషాదం చోటు చేసుకుంది. ఓ పాత భవనాన్ని కూల్చి వేస్తుండగా ప్రమాదం జరిగింది. ఈ ఘటనలో ఇద్దరు కార్మికులు మృతి చెందారు.
వివరాల్లోకి వెళితే.. చార్బౌలి ప్రాంతంలో ఓ పాత భవనాన్ని శనివారం ఉదయం కూల్చివేస్తుండగా భవనం ఒక్కసారిగా కుప్పకూలింది. దీంతో శిథిలాల కింద పలువురు కూలీలు చిక్కుకున్నారు. సమాచారం అందుకున్న పోలీసులు, అగ్నిమాపక సిబ్బంది వెంటనే ఘటనాస్థలానికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. భవనం శిథిలాల నుంచి సునీత, సాగర్ ల మృతదేహాలను వెలికితీశారు. ఈ ఘటనలో మరో ఇద్దరు తీవ్రంగా గాయపడ్డారు. వెంటనే వారిని ఎంజీఎం ఆస్పత్రికి తరలించారు. శిథిలాల కింద ఇంకా ఎవరైనా చిక్కుకున్నారేమోనని సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. కూలీల మృతితో వారి కుటుంబాల్లో విషాదం నెలకొంది.