ఘోర ప్రమాదం.. డబుల్‌ డెక్కర్‌ బస్సులు ఢీ.. 8 మంది మృతి

Dead several injured bus accident UP Purvanchal expressway. ఉత్తరప్రదేశ్‌లో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. పూర్వాంచల్‌ ఎక్స్‌ప్రెస్‌వేపై సోమవారం ఉదయం

By అంజి
Published on : 25 July 2022 9:38 AM IST

ఘోర ప్రమాదం.. డబుల్‌ డెక్కర్‌ బస్సులు ఢీ.. 8 మంది మృతి

ఉత్తరప్రదేశ్‌లో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. పూర్వాంచల్‌ ఎక్స్‌ప్రెస్‌వేపై సోమవారం ఉదయం రెండు డబుల్ డెక్కర్ ప్రైవేట్‌ బస్సులు ఒకదానికొకటి ఢీకొన్నాయి. ఈ ఘటనలో 8 మంది మృతి చెందారు. పలువురికి తీవ్రగాయాలు అయ్యాయి. రిపోర్టు ప్రకారం.. ఈ ఘటనలోని కత్రా పోలీస్ స్టేషన్ పరిధిలోని నారాయణ్‌పూర్ గ్రామ సమీపంలో జరిగింది. రెండు వాహనాలు బీహార్ నుంచి ఢిల్లీకి వెళ్తుండగా ఢీకొన్నాయి. ఓ బస్సు ఒక్కసారిగా ఆగిపోవడంతో వేగంగా వచ్చిన రెండో బస్సు ఢీకొట్టింది.

క్షతగాత్రులను చికిత్స అనంతరం లక్నో ట్రామా సెంటర్‌కు తరలించారు. గాయపడిన వారిలో పలువురి పరిస్థితి విషమంగా ఉన్నట్లు తెలుస్తోంది. విషయం తెలుసుకున్న బారాబంకి పోలీసు యంత్రాంగం వెంటనే ప్రమాద స్థలానికి చేరుకుంది. ఉన్నతాధికారులు కూడా సంఘటనా స్థలంలో ఉన్నారు. మరోవైపు ప్రమాదంలో మృతి చెందిన మృతుల కుటుంబాలకు ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ సంతాపం తెలిపారు.


Next Story