దళిత బాలుడిని, అమ్మమ్మను కొట్టిన రైల్వే పోలీసులు.. దుమారం రేపుతోన్న వీడియో
రైల్వే పోలీస్ స్టేషన్లో 15 ఏళ్ల దళిత బాలుడు, అతని అమ్మమ్మను అధికారులు కొట్టిన వీడియో బయటపడింది. ఇది ఇప్పుడు దేశ వ్యాప్తంగా కలకలం రేపుతోంది.
By అంజి Published on 29 Aug 2024 2:45 PM IST
దళిత బాలుడిని, అమ్మమ్మను కొట్టిన రైల్వే పోలీసులు.. దుమారం రేపుతోన్న వీడియో
మధ్యప్రదేశ్లోని రైల్వే పోలీస్ స్టేషన్లో 15 ఏళ్ల దళిత బాలుడు, అతని అమ్మమ్మను అధికారులు కొట్టిన వీడియో బయటపడింది. ఇది ఇప్పుడు దేశ వ్యాప్తంగా కలకలం రేపుతోంది. వివాదం నేపథ్యంలో ఓ అధికారిని సస్పెండ్ చేసి విచారణకు ఆదేశించారు.
అక్టోబర్ 2023 నుండి నివేదించబడిన ఈ వీడియో.. జబల్పూర్లోని కట్ని గవర్నమెంట్ రైల్వే పోలీస్ (GRP) స్టేషన్కు బాధ్యత వహించే అరుణ వగనే అనే అధికారి, కుసుమ్ వాన్స్కర్ అనే మహిళను కర్రతో కొట్టడం, ఆమె తన మనవడి ముందు నొప్పితో విలపిస్తున్నప్పుడు ఆమెను అధికారి తన్నింది. సిసిటివి ఫుటేజీలో పోలీసు అధికారుల బృందం బాలుడిని కొట్టడం, తన్నడం ఇంకా చూపించింది. ఈ ఘటనకు సంబంధించిన వీడియో ఇప్పుడు వైరల్గా మారగా, వివాదం జరగడంతో ఘటనపై దర్యాప్తు ప్రారంభించారు.
कटनी की वीभत्स घटना से पूरा मध्य प्रदेश स्तब्ध है। एक दलित माँ - बेटे को भाजपा के वर्दी वाले गुंडों ने बंद कमरे में लाठी से पिट पिट कर अर्धमृत कर दिया है। भाजपा के कुशासन में मध्य प्रदेश के दलित भयावह जीवन जीने को मजबूर हैं। अगर मुख्यमंत्री अपने प्रदेश के लोगों की सुरक्षा नहीं कर… https://t.co/nB79pT797Y
— Jitendra (Jitu) Patwari (@jitupatwari) August 28, 2024
మోహన్ యాదవ్ నేతృత్వంలోని రాష్ట్రంలోని బిజెపి ప్రభుత్వాన్ని కాంగ్రెస్ నాయకులు లక్ష్యంగా చేసుకున్నారు. ఈ సంఘటనను 'దళితులపై అణచివేతకు' ఉదాహరణగా పేర్కొన్నారు. మధ్యప్రదేశ్ కాంగ్రెస్ అధ్యక్షుడు జితు పట్వారీ, ఈ ఘటనకు సంబంధించిన వీడియోను షేర్ చేస్తూ, "దళితులపై అణచివేత బిజెపికి అతిపెద్ద ఆయుధంగా మారిందని" ఆరోపిస్తూ, "ఈ రాజకీయ దురుద్దేశంతో కూడిన ఆట ఆగాలి!" అని అన్నారు.
దీనిని "భయంకరమైన సంఘటన" అని పేర్కొన్న ఆయన, "బిజెపి దుష్పరిపాలనలో మధ్యప్రదేశ్లోని దళితులు భయంకరమైన జీవితాన్ని గడపవలసి వస్తుంది. ముఖ్యమంత్రి తన రాష్ట్ర ప్రజలను రక్షించలేకపోతే, వెంటనే రాజీనామా చేయాలి అని డిమాండ్ చేశారు. మధ్యప్రదేశ్ యూత్ కాంగ్రెస్, దాని అధికారిక సోషల్ మీడియా హ్యాండిల్లో, ప్రభుత్వాన్ని లక్ష్యంగా చేసుకుంది. పోలీసులు "లా అండ్ ఆర్డర్ పేరుతో గూండాయిజానికి పాల్పడి ప్రజలను చంపుతున్నారు" అని అన్నారు.
అధికారి అరుణా వగనే ప్రకారం.. కుసుమ్ వంస్కర్ కుమారుడు, దీప్రాజ్ తండ్రి దీపక్ వాన్స్కర్పై అతనిపై 19 కేసులు ఉన్నాయి. అతనిని పట్టుకునే వారికి 10,000 రూపాయల రివార్డ్ను రైల్వే పోలీసులు ప్రకటించారు. అతని కుటుంబం మొత్తం దొంగతనాలకు సపోర్ట్ చేస్తుందని, అందుకే అతని కుటుంబ సభ్యులను విచారణ కోసం రప్పించారని అధికారి ఆరోపించారు. ఆ తర్వాత దీపక్ వంస్కర్ అరెస్ట్ అయ్యి ప్రస్తుతం జైల్లో ఉన్నాడు.
ఈ వివాదం తర్వాత, జబల్పూర్ రైల్వే పోలీస్ సూపరింటెండెంట్ (SRP) స్టేషన్ ఇన్చార్జిని సస్పెండ్ చేశామని, డిపార్ట్మెంట్ సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ ఆధ్వర్యంలో దర్యాప్తుకు ఆదేశించామని చెప్పారు. దీపక్ వాన్స్కర్ హిస్టరీ-షీటర్ అని, 2017 నుంచి నిఘాలో ఉన్నారని కూడా అధికారి హైలైట్ చేశారు. ఫిర్యాదు నమోదైతే పోలీసు విచారణ చేపడతామని కట్ని అదనపు పోలీసు సూపరింటెండెంట్ సంతోష్ సెహ్రియా తెలిపారు.
"వివిధ సోషల్ మీడియా గ్రూపులలో ఒక వీడియో వైరల్ అయ్యింది, ఇక్కడ ప్రాథమికంగా ఇది GRP కట్నీ కేసుగా అనిపిస్తుంది... దీనికి సంబంధించి మాకు ఎటువంటి ఫిర్యాదు అందలేదు.ఫిర్యాదు నమోదు చేస్తే, దాని ఆధారంగా దర్యాప్తు జరుగుతుంది" అని ఏఎస్పీ సెహ్రియా తెలిపారు.