విషాదం.. సంగారెడ్డిలో దంప‌తుల ఆత్మ‌హ‌త్య‌.. ఆర్థిక ఇబ్బందులే కార‌ణం

Couple Commits suicide in Sangareddy.సంగారెడ్డి ప‌ట్ట‌ణంలో విషాదం చోటు చేసుకుంది. ఆర్థిక ఇబ్బందుల కార‌ణంగా దంప‌తులు

By తోట‌ వంశీ కుమార్‌  Published on  9 Jun 2022 9:33 AM GMT
విషాదం.. సంగారెడ్డిలో దంప‌తుల ఆత్మ‌హ‌త్య‌.. ఆర్థిక ఇబ్బందులే కార‌ణం

సంగారెడ్డి ప‌ట్ట‌ణంలో విషాదం చోటు చేసుకుంది. ఆర్థిక ఇబ్బందుల కార‌ణంగా దంప‌తులు బ‌ల‌వ‌న్మ‌ర‌ణానికి పాల్ప‌డ్డారు.

వివ‌రాల్లోకి వెళితే.. నారంరెడ్డి కాల‌నీకి చెందిన త్రినాథ్‌రెడ్డి(35), మ‌ల్లిక (33) లు 12 సంవ‌త్స‌రాల క్రితం ప్రేమ వివాహం చేసుకున్నారు. వీరికి నాలుగేళ్ల కుమారుడు ఉన్నాడు. త్రినాథ్‌రెడ్డి రియ‌ల్ ఎస్టేట్ వ్యాపారి కాగా.. మ‌ల్లిక సాఫ్ట్‌వేర్ ఉద్యోగం చేస్తోంది. కాగా.. ఆర్థిక ఇబ్బందుల కార‌ణంగా గ‌త కొంత‌కాలంగా దంప‌తుల మ‌ధ్య గొడ‌వ‌లు జ‌రుగుతున్నాయి. ఈ క్ర‌మంలో బుధ‌వారం రాత్రి వీరిద్ద‌రి మ‌ధ్య మ‌రోసారి గొడ‌వ జ‌రిగింది.

దీంతో ఇద్ద‌రూ గ‌దిలోకి వెళ్లి ఆత్మ‌హ‌త్య‌కు పాల్ప‌డ్డారు. గ‌దిలోకి వెళ్లిన దంప‌తులు ఎంత‌సేపైనా బ‌య‌ట‌కు రాక‌పోవ‌డంతో త్రినాథ్‌రెడ్డి త‌ల్లి అమరావ‌తి చుట్టు ప‌క్క‌ల వారి సాయంతో త‌లుపుల ప‌గ‌ల కొట్టారు. అప‌స్మార‌క స్థితిలో ఉన్న ఇద్ద‌రిని ఆస్ప‌త్రికి త‌ర‌లించగా.. అప్ప‌టికే వారు మృతి చెందిన‌ట్లు వైద్యులు తెలిపారు. త్రినాథ్‌రెడ్డి త‌ల్లి ఫిర్యాదు మేర‌కు కేసు న‌మోదు చేసిన పోలీసులు ద‌ర్యాప్తు చేప‌ట్టారు. ఆర్థిక ఇబ్బందులు, కుటుంబ క‌ల‌హాల‌తోనే దంప‌తులు ఆత్మ‌హ‌త్య‌కు పాల్ప‌డిన‌ట్లు పోలీసులు తెలిపారు.

Next Story