దారుణం.. అడవిలో మైనర్‌ బాలిక మృతదేహాం.. హత్యకు ముందు అత్యాచారం

Body of minor girl found in UP's Budaun. Allegations of rape before murder. ఉత్తరప్రదేశ్‌లోని బుదౌన్ జిల్లాలో దారుణ ఘటన వెలుగు చూసింది. ఫైజ్‌గంజ్ బెహతా పోలీస్ స్టేషన్ పరిధిలోని రైల్వే లైన్ సమీపంలో

By అంజి  Published on  18 Sep 2022 5:49 AM GMT
దారుణం.. అడవిలో మైనర్‌ బాలిక మృతదేహాం.. హత్యకు ముందు అత్యాచారం

ఉత్తరప్రదేశ్‌లోని బుదౌన్ జిల్లాలో దారుణ ఘటన వెలుగు చూసింది. ఫైజ్‌గంజ్ బెహతా పోలీస్ స్టేషన్ పరిధిలోని రైల్వే లైన్ సమీపంలో ఉన్న అడవిలో శనివారం మైనర్ బాలిక మృతదేహాం లభ్యమైంది. హత్యకు ముందు బాలికపై అత్యాచారం చేశారని కుటుంబ సభ్యులు ఆరోపిస్తున్నారు. పోలీసులు చెప్పిన వివరాలు ఇలా ఉన్నాయి. శనివారం ఉదయం ఫైజ్‌గంజ్ బెహటా పోలీస్ స్టేషన్ పరిధిలో 15 ఏళ్ల బాధితురాలి మృతదేహాన్ని స్వాధీనం చేసుకుని, పోస్ట్‌మార్టం కోసం పంపారు.

బంధువులు రాకముందే బుదౌన్ పోలీసులు మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం పంపించారని బాధిత కుటుంబీకులు ఆరోపిస్తున్నారు. మృతదేహాన్ని పోస్టుమార్టంకు పంపే ముందు అధికారులు కుటుంబ సభ్యులకు కూడా సమాచారం ఇవ్వలేదని బాధిత కుటుంబీకులు ఆరోపించారు. "మా కుమార్తె ప్రమాదానికి గురైందని, మృతదేహాన్ని గుర్తించడానికి మమ్మల్ని పిలిచినట్లు ఒక పోలీసు మాకు తెలియజేశాడు" అని మృతురాలి మామ చెప్పాడు. "మా గ్రామం నుండి సంఘటన జరిగిన ప్రదేశానికి దూరం ఒకటిన్నర కిలోమీటర్లు" అని అతను చెప్పాడు. పోలీసులు సంఘటన స్థలం నుండి అన్ని ఆధారాలను చెరిపివేశారని అన్నాడు.

సమాచారం అందుకున్న సీనియర్‌ సూపరింటెండెంట్‌ ఆఫ్‌ పోలీస్‌ (ఎస్‌ఎస్పీ) ఓపీ సింగ్‌ సంఘటనా స్థలానికి చేరుకున్నారు. ఈ విషయమై పోలీస్ స్టేషన్‌లో కేసు నమోదు చేసి కఠిన చర్యలు తీసుకుంటామని తెలిపారు. వైద్యుల బృందం పోస్ట్‌మార్టం నిర్వహిస్తోందని, మొత్తం పరీక్ష ప్రక్రియను వీడియోగ్రఫీ కూడా చేస్తామని ఆయన చెప్పారు."తుది నివేదిక ఆధారంగా, కేసులో నమోదు చేయబడిన సెక్షన్ల సంఖ్యను పెంచడం ద్వారా చర్యలు తీసుకోబడతాయి, ఎవరైనా దోషిగా తేలితే, ఆ వ్యక్తిని అరెస్టు చేస్తాం." అని ఎస్‌ఎస్పీ చెప్పారు.

Next Story