ఇంజక్షన్ హత్య కేసులో సంచలనం.. ప్రియుడి కోసం భార్య పక్కా మర్డర్ స్కెచ్‌

Biker injection murder case.. wife plans to kill husband over illicit affair. ఖమ్మంలో సంచలనం సృష్టించిన ఇంజక్షన్ హత్య కేసు వెనుక మిస్టరీని పోలీసులు ఛేదించారు. సోమవారం ఖమ్మంలో

By అంజి  Published on  22 Sep 2022 8:40 AM GMT
ఇంజక్షన్ హత్య కేసులో సంచలనం.. ప్రియుడి కోసం భార్య పక్కా మర్డర్ స్కెచ్‌

ఖమ్మంలో సంచలనం సృష్టించిన ఇంజక్షన్ హత్య కేసు వెనుక మిస్టరీని పోలీసులు ఛేదించారు. సోమవారం ఖమ్మంలో ఓ వ్యక్తికి విష ఇంజక్షన్ ఇచ్చి హతమార్చిన సంగతి తెలిసిందే. ఈ కేసులో ఆరుగురిని అరెస్టు చేసినట్లు ఖమ్మం రూరల్ ఏఎస్పీ బస్వా రెడ్డి బుధవారం తెలిపారు. ఆయన తెలిపిన వివరాల ప్రకారం.. చింతకాని మండలం బొప్పారం గ్రామానికి చెందిన షేక్‌ జమాల్‌ సాహెబ్‌ (48), అతని భార్య షేక్‌ ఇమాంబీ (46) ఇద్దరు కూలీ పనులు చేస్తున్నారు. షేక్‌ ఇమాంబీకి గత రెండేళ్లుగా ఆటో డ్రైవర్ గోదా మోహన్‌రావుతో వివాహేతర సంబంధం ఏర్పడింది.

ఈ విషయం తెలుసుకున్న జమాల్ ఆమెను మందలించాడు. దీంతో కోపోద్రిక్తురాలైన భార్య మోహన్‌రావుతో కలిసి భర్తను హత్య చేసేందుకు పథకం పన్నింది. మోహన్‌రావు రూ.3,500 చెల్లించి ఆర్‌ఎంపీ బండి వెంకన్న నుంచి విష ఇంజెక్షన్లు కొనుగోలు చేశాడు. హత్య పథకంలో భాగంగా ఏపీలోని జగ్గయ్యపేటలో ఉన్న తన కుమార్తె ఇంటికి వెళ్లిన ఇమాంబీ.. తనను తీసుకురావాలని భర్తను కోరింది.

సెప్టెంబరు 19న జమాల్ బైక్‌పై ఏపీకి బయలుదేరాడు. ఇమాంబీ మోహన్‌రావుకు మొన్న రాత్రి ఈ విషయాన్ని తెలియజేసి తన వాహనం నంబర్‌ను ఇచ్చాడు. మోహన్‌రావు కోరడంతో ఆర్‌ఎంపీ వెంకన్న, ట్రాక్టర్‌ డ్రైవర్‌ వెంకటేష్‌ ముదిగొండ వద్ద జమాల్‌ కోసం వేచి ఉండి లిఫ్ట్‌ ఇవ్వాలని జమాల్‌ను కోరారు. బైక్‌పై కూర్చున్న వెంకన్న జమాల్‌కు ఇంజక్షన్ ఇచ్చి అక్కడి నుంచి పరారయ్యాడు.

హత్య జరిగిన రోజు తెల్లవారుజామున ఇమాంబీ మోహన్‌రావు, వెంకటేష్‌లకు పలుమార్లు ఫోన్ చేసినట్లు పోలీసులు విచారణలో గుర్తించారు. విచారణ అనంతరం మిస్టరీని ఛేదించారు. గోదా మోహనరావు, బండి వెంకన్న, నర్సింశెట్టి వెంకటేష్, షేక్ ఇమాంబీ, బందెల యశ్వంత్, పోరాళ్ల సాంబశివరావులను పోలీసులు అరెస్టు చేశారు.

Next Story