వరి పొలంలో కూతురి మృతదేహం.. తండ్రి అరెస్ట్‌

అసోంలో దారుణ ఘటన జరిగింది. తన ఏడాది వయస్సు గల కూతురిని హత్య తండ్రి హత్య చేశాడు.

By అంజి  Published on  10 March 2023 8:45 AM GMT
Assam man, Crime

వరి పొలంలో కూతురి మృతదేహం.. తండ్రి అరెస్ట్‌

అసోంలో దారుణ ఘటన జరిగింది. తన ఏడాది వయస్సు గల కూతురిని హత్య తండ్రి హత్య చేశాడు. సోనిత్‌పూర్ జిల్లాలో శుక్రవారం నిందితుడిని పోలీసులు అరెస్టు చేశారు. చిన్నారని దారుణంగా హత్య చేశాడని ఆరోపిస్తూ అతని భార్య ఫిర్యాదు చేయడంతో ఈ అరెస్టు జరిగింది. గోహ్‌పూర్‌కు చెందిన సచిన్ బోర్డోలోయ్ అనే నిందితుడు గురువారం శిశువును తీసుకుని తన ఇంటి నుండి బయటకు వెళ్లాడు. కానీ తిరిగి ఇంటికి రాలేదు. అనంతరం వరి పొలంలో చిన్నారి మృతదేహాన్ని స్థానికులు గుర్తించారు.

ఈ ఘటన అనంతరం బోర్డోలోయి కనిపించకుండా పోవడంతో ఈ నేరంలో అతడి ప్రమేయంపై అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. నేరం చేసిన తర్వాత నిందితుడు సిమెంట్చాప్రీకి బయలుదేరి తెల్లవారుజామున 3 గంటలకు ఇంటికి తిరిగి వచ్చాడు. బాధితురాలి తల్లి తన భర్త నేరానికి పాల్పడినట్లు ఆరోపించింది. ఆమె ఫిర్యాదు మేరకు, పోలీసులు అతనిని అరెస్టు చేశారు. కుటుంబ కలహాల కారణంగానే అతడు ఈ నేరానికి పాల్పడ్డాడని ఓ సీనియర్ పోలీసు అధికారి తెలిపారు.

పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం, గోహ్‌పూర్‌లో హత్య జరిగిన ప్రదేశం దగ్గర సైకిల్‌తో పాటు షాపింగ్ బ్యాగ్ కూడా లభ్యమైంది. కాగా, నిందితులపై కఠిన చర్యలు తీసుకోవాలని స్థానికులు డిమాండ్ చేస్తున్నారు. ఇదిలా ఉంటే.. అస్సాంలోని గౌహతిలో తన భార్యతో గొడవపడి 5 నెలల చిన్నారిని చంపేందుకు ప్రయత్నించిన 35 ఏళ్ల వ్యక్తిని అరెస్ట్ చేసినట్లు పోలీసులు తెలిపారు. అరెస్టయిన వ్యక్తి గౌహతి నగరంలోని కహిలిపరా ప్రాంతానికి చెందిన రోజువారీ కూలీ. స్థానిక నివాసి నుండి సమాచారం అందుకున్న పోలీసులు.. ఆ వ్యక్తిని శనివారం అరెస్టు చేసినట్లు గౌహతి తూర్పు జిల్లా డిప్యూటీ కమిషనర్ ఆఫ్ పోలీస్ (డిసిపి) తెలిపారు.

Next Story