భర్తను అరెస్టు చేయించిన అప్సర.. ఏమైందంటే?

Apsara murder case Update. శంషాబాద్ హత్యకు గురైన అప్సర గురించి ఎన్నో విషయాలు బయటకు వస్తూ ఉన్నాయి.

By M.S.R  Published on  12 Jun 2023 6:21 AM GMT
భర్తను అరెస్టు చేయించిన అప్సర.. ఏమైందంటే?

శంషాబాద్ హత్యకు గురైన అప్సర గురించి ఎన్నో విషయాలు బయటకు వస్తూ ఉన్నాయి. అప్సరకు ఇంతకు ముందే పెళ్లైందని, భర్తతో కలిసి ఉన్న ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. కార్తీక్ రాజా అనే వ్యక్తిని పెళ్లి చేసుకున్న అప్సర.. ఆ తర్వాత అతడి నుండి విడిగా జీవించడం మొదలుపెట్టింది. అతడిపై కేసులు పెట్టినట్లు కూడా తాజాగా విషయం బయటకు వచ్చింది.

కార్తీక్ రాజా అనే వ్యక్తి తల్లి ధనలక్ష్మి ఓ ఆడియో విడుదల చేసారు. తన కొడుకు కార్తీక్ రాజు ఆత్మహత్యకు అప్సర, ఆమె తల్లి వేధింపులే కారణం అంటూ ఆమె చెప్పుకొచ్చింది. చెన్నైకి చెందిన సాఫ్ట్వేర్ ఇంజనీర్ కార్తీక్ రాజా అప్సరను ప్రేమించి పెళ్లి చేసుకున్నాడు. ఆ తరువాత డబ్బుల కోసం, టూర్లకు వెళ్లాలంటూ అప్సర తన కొడుకును వేధించేదని, లగ్జరీ లైఫ్ కోసం అతడిని హింసించేదని కార్తీక్ తల్లి ధనలక్ష్మి తెలిపింది. అప్సర, ఆమె తల్లి అరుణల వేధింపుల వల్లే తన కొడుకు ఆత్మహత్య చేసుకున్నాడని ఆడియోలో పేర్కొంది. కార్తీక్ రాజా మీద ఒకసారి అప్సర పోలీస్ కేసు కూడా పెట్టిందని, దీంతో పోలీసులు అతడిని అరెస్ట్ చేసి జైల్లో పెట్టారని తెలిపింది. ఈ అవమానాన్ని తట్టుకోలేక కార్తీక్ రాజా ఆత్మహత్య చేసుకుని చనిపోయాడని ఆమె తన ఆడియోలో తెలిపింది. ఆ తరువాతి నుంచి అప్సర, ఆమె తల్లి అరుణ కనిపించలేదన్నారు. అప్సర, ఆమె తల్లి అరుణ హైదరాబాద్‌లో ఉన్నట్లు కూడా తమకు తెలియదన్నారు. అప్సరకు సినిమాల్లో నటించాలని కోరిక ఉండేదన్నారు. అందుకోసమే అప్సరను తీసుకొని హైదరాబాద్ వెళ్లి ఉంటుందని తాను భావిస్తున్నానని ధనలక్ష్మి ఆడియోలో తెలిపింది.

సాయికృష్ణ తండ్రి తన కొడుకును అప్సర వేధించిందని చెబుతున్నారు. గత మూడు నెలలుగా తన కొడుకును అప్సర తీవ్రంగా వేధిస్తోందని.. టార్చర్ భరించలేకపోతున్నానని కొడుకు అన్నాడని చెప్పుకొచ్చారు.


Next Story