DJ Sound: డీజే సౌండ్.. అమలాపురంలో యువకుడి ప్రాణాలను బలి తీసుకుందా?

దుర్గామాత విగ్రహాన్ని వీధుల్లో ఊరేగించేందుకు డీజే సౌండ్ బాక్సులను ఏర్పాటు చేశారు

By Medi Samrat
Published on : 13 Oct 2024 8:30 PM IST

DJ Sound: డీజే సౌండ్.. అమలాపురంలో యువకుడి ప్రాణాలను బలి తీసుకుందా?

అమలాపురంలోని డీజే సౌండ్ బాక్సుల నుంచి వెలువడిన భారీ శబ్దానికి కార్డియాక్ అరెస్ట్ కారణంగా ఇరవై ఏళ్ల పప్పుల వినయ్ మరణించాడని అంటున్నారు. అమలాపురం రూరల్ మండలం బండారులంక గ్రామానికి చెందిన వినయ్ తన స్నేహితులతో కలిసి అమలాపురంలో జరిగిన దసరా ముగింపు ఉత్సవాల్లో పాల్గొన్నారు. పోలీసు అధికారుల నుంచి అనుమతి తీసుకుని దుర్గామాత విగ్రహాన్ని వీధుల్లో ఊరేగించేందుకు డీజే సౌండ్ బాక్సులను ఏర్పాటు చేశారు.

సాయంత్రం స్థానిక కనకదుర్గ గుడి నుంచి ఊరేగింపు ప్రారంభం కాగా వినయ్‌తో సహా యువకులు డీజే బాక్సుల ముందు డ్యాన్స్ చేయడం ప్రారంభించారు. అకస్మాత్తుగా, వినయ్ కుప్పకూలిపోయాడు. అతని స్నేహితులు అతన్ని సమీపంలోని ఆసుపత్రికి తరలించగా అక్కడ వైద్యులు అతను చనిపోయినట్లు ప్రకటించారు. వినయ్ డీజే బాక్సులకు దగ్గరగా డ్యాన్స్ చేయడంతో ఒక్కసారిగా గుండెచప్పుడు పెరగడం వల్లే చనిపోయి ఉండవచ్చునని అంటున్నారు. వినయ్ మృతితో బండారులంకలో తీవ్ర విషాదం నెలకొంది.


Next Story