Anantapur: భూవివాదం.. అక్కపై తమ్ముడు గొడ్డలితో దాడి

ఇంటి స్థలం విషయంలో తలెత్తిన వివాదంలో ఓ వ్యక్తి తన సోదరిపై గొడ్డలితో దాడి చేసి తీవ్రంగా గాయపరిచిన ఘటన అనంతపురం జిల్లాలో చోటుచేసుకుంది.

By అంజి  Published on  10 July 2024 1:20 AM GMT
Anantapur, Attack, Land Dispute

Anantapur: భూవివాదం.. అక్కపై తమ్ముడు గొడ్డలితో దాడి

ఇంటి స్థలం విషయంలో తలెత్తిన వివాదంలో ఓ వ్యక్తి తన సోదరిపై గొడ్డలితో దాడి చేసి తీవ్రంగా గాయపరిచిన ఘటన అనంతపురం జిల్లా గార్లదిన్నె మండలం పెనకచెర్ల గ్రామంలో మంగళవారం చోటుచేసుకుంది. తన సోదరి మహబూబిపై జిలానీ అనే వ్యక్తి దాడి చేసిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. పెనకచెర్ల గ్రామంలో మహబూబీ నివాసం ఉంటున్న ఇంటి స్థలం విషయంలో గత కొన్ని నెలలుగా వివాదం నడుస్తోందని పోలీసులు తెలిపారు. జిలానీ తన సోదరిని సైట్ నుండి వెళ్లిపోవాలని కోరుతూ బెదిరించేవాడు.

మంగళవారం నాడు గొడ్డలితో సంఘటనా స్థలానికి చేరుకున్న జిలానీ తన సోదరిపై దాడి చేయడం ప్రారంభించాడు. చుట్టుపక్కల వారు అడ్డుకునేందుకు ప్రయత్నించారు. ఆమె కేకలు వేయడంతో అతడు పలుమార్లు దాడి చేశాడు. తీవ్ర గాయాలపాలైన మహబూబీని అనంతపురం సర్వజన ఆసుపత్రికి తరలించారు. సోషల్ మీడియాలో దాడి చేసిన వీడియోని గమనించిన గార్లదిన్నె పోలీసులు జిలానీని అరెస్ట్ చేసి కేసు నమోదు చేసినట్లు అనంతపురం రూరల్ డీఎస్పీ బివి శివారెడ్డి తెలిపారు.

Next Story