ఏపీలో ఘోరం.. 8 ఏళ్ల బాలికపై ముగ్గురు మైనర్లు అత్యాచారం, హత్య.. మృతదేహాన్ని కాలువలో పడేసి..

ఎనిమిదేళ్ల బాలికపై ఆరు, ఏడో తరగతి చదువుతున్న ముగ్గురు మైనర్లు సామూహిక అత్యాచారం చేసి హత్య చేశారు. ఈ ఘటన ఆంధ్రప్రదేశ్‌లోని నంద్యాల జిల్లాలో చోటుచేసుకుంది.

By అంజి  Published on  11 July 2024 4:58 AM GMT
murder, minors, Nandyala, APnews

ఏపీలో ఘోరం.. 8 ఏళ్ల బాలికపై ముగ్గురు మైనర్లు అత్యాచారం, హత్య.. మృతదేహాన్ని కాలువలో పడేసి..

నంద్యాల: ఎనిమిదేళ్ల బాలికపై ఆరు, ఏడో తరగతి చదువుతున్న ముగ్గురు మైనర్లు సామూహిక అత్యాచారం చేసి హత్య చేశారు. ఈ ఘటన ఆంధ్రప్రదేశ్‌లోని నంద్యాల జిల్లాలో చోటుచేసుకుంది.

నాలుగు రోజులుగా బాలిక కనిపించకుండా పోయింది. విచారణలో ఆరు, ఏడో తరగతులు చదువుతున్న ముగ్గురు మైనర్లు ఆమెపై సామూహిక అత్యాచారం చేసి హత్య చేసినట్లు పోలీసులు గుర్తించారు. అయితే బాలిక మృతదేహాన్ని పోలీసులు ఇంకా గుర్తించలేదు.

పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. జూలై 7న సమీపంలోని మైదానంలోకి వెళ్లిన తన కూతురు కనిపించకుండా పోయిందని బాలిక తండ్రి పోలీసులకు ఫిర్యాదు చేశాడు. పోలీసులు బృందాలుగా ఏర్పడినా ఆమె జాడ తెలియలేదు.

అనంతరం స్నిఫర్‌ డాగ్‌ల సాయంతో పోలీసులు తనిఖీలు నిర్వహించగా ముగ్గురు మైనర్‌ బాలురను అనుమానాస్పదంగా గుర్తించి అదుపులోకి తీసుకున్నారు. పట్టుబడతామనే భయంతో బాలికపై అత్యాచారం చేసి కాలువలోకి తోసి హత్య చేసినట్లు మైనర్ బాలురు ఒకరు పోలీసుల ఎదుట అంగీకరించినట్లు ప్రాథమిక విచారణలో వెల్లడైంది.

మైనర్ల ఒప్పుకోలు ఆధారంగా ముచ్చుమర్రి లిఫ్ట్ ఇరిగేషన్ వాటర్ పంప్ హౌస్ సమీపంలోని కృష్ణా నది బ్యాక్ వాటర్ లో పోలీసులు సోదాలు చేపట్టారు. ఎస్‌డిఆర్‌ఎఫ్ బృందాలు ఐదు బోట్ల సాయంతో నదిలో మృతదేహం కోసం గాలిస్తున్నారు. అయితే, ఇంకా జాడలు కనుగొనబడలేదు.

Next Story