Siddipet: మహిళ దారుణ హత్య.. కాళ్లు నరికేశారు

సిద్దిపేట : ములుగు పోలీసు పరిధిలోని బండ మైలారం గ్రామంలో గురువారం ఓ మహిళను హత్య చేసి రెండు కాళ్లు నరికివేశారు .

By అంజి  Published on  24 Aug 2023 5:45 AM GMT
woman, murder, Siddipet, Crime news

Siddipet: మహిళ దారుణ హత్య.. కాళ్లు నరికేశారు

ఇటీవల కాలంలో మహిళలపై అఘాయిత్యాలు, హత్యలు పెరిగిపోతున్నాయి. మానవ మృగాల చేతుల్లో మహిళల ప్రాణాలు బలైపోతున్నాయి. సిద్దిపేట జిల్లాలో దారుణ ఘటన చోటు చేసుకుంది. గురువారం నాడు దుండగులు ఓ మహిళను అతి క్రూరంగా హత్య చేశారు. ఆమె ఇంట్లోనే దుండగులు గొంతు కోసి కాళ్లను శరీరం నుంచి వేరు చేశారు. ములుగు మండలం బండమైలారంలో ఈ ఘటన జరిగింది. స్థానికంగా ఈ ఘటన తీవ్ర కలకలం రేపింది. విషయం తెలుసుకున్న గజ్వేల్‌ ఏసీపీ రమేష్‌ ఘటనా స్థలానికి చేరుకుని పరిశీలించారు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. హత్యకు గురైన మహిళను వెంకటమ్మ (40)గా పోలీసులు గుర్తించారు.

వెంకటమ్మ ప్లాస్టిక్‌ వంటి సామాగ్రి అమ్ముతూ జీవనం కొనసాగిస్తోంది. ఆమెకు ముగ్గురు పిల్లలు ఉన్నారు. వెంకటమ్మ భర్త కొన్నేళ్ల కిందట మృతి చెందాడు. అయితే ఇప్పుడు వెంకటమ్మను హత్య చేసింది ఎవరు? హత్యకు గల కారణాలు ఏంటి అనే కోణంలో పోలీసుల దర్యాప్తు సాగుతోంది. డాగ్ స్క్వాడ్, ఫోరెన్సిక్ టీం కూడా సాక్ష్యాలను సేకరించేందుకు చర్యలు చేపట్టింది. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం గజ్వేల్ ఏరియా ఆసుపత్రికి తరలించారు. వెంకటమ్మ మరణంతో ఆ కుటుంబం కన్నీరుమున్నీరుగా విలపిస్తోంది. ఆమె హత్యతో గ్రామంలో విషాద ఛాయలు అలుముకున్నాయి.

Next Story