ఘోర రోడ్డు ప్రమాదం.. కేంద్ర ఆర్థికశాఖ అధికారి మృతి, భార్య పరిస్థితి విషమం

ఆదివారం ఢిల్లీలోని ధౌలా కువాన్ సమీపంలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఆర్థిక మంత్రిత్వ శాఖ అధికారి, అతని భార్య బంగ్లా సాహిబ్ ..

By -  అంజి
Published on : 15 Sept 2025 7:48 AM IST

Finance Ministry official died, car collided with a bike, Delhi

ఘోర రోడ్డు ప్రమాదం.. కేంద్ర ఆర్థికశాఖ అధికారి మృతి, భార్య పరిస్థితి విషమం

ఆదివారం ఢిల్లీలోని ధౌలా కువాన్ సమీపంలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఆర్థిక మంత్రిత్వ శాఖ అధికారి, అతని భార్య బంగ్లా సాహిబ్ గురుద్వారాను సందర్శించి ఇంటికి తిరిగి వస్తుండగా, వారి బైక్‌ను బీఎండబ్ల్యూ కారు ఢీకొట్టింది. దీంతో సీనియర్ అధికారి ఒకరు మృతి చెందగా, ఆయన భార్య తీవ్రంగా గాయపడింది. బాధితుడు నవజ్యోత్ సింగ్ ఆర్థిక మంత్రిత్వ శాఖ పరిధిలోని ఆర్థిక వ్యవహారాల విభాగంలో డిప్యూటీ సెక్రటరీగా పనిచేస్తున్నాడు.

అతను, అతని భార్య బంగ్లా సాహిబ్ గురుద్వారా నుండి ఇంటికి తిరిగి వస్తుండగా రింగ్ రోడ్‌లో ప్రమాదం జరిగింది. ఆ ప్రాంతంలో ట్రాఫిక్ జామ్ గురించి తమకు అనేక కాల్స్ వచ్చాయని, రోడ్డుపై పక్కకు తిరిగిన BMW కారు, డివైడర్ దగ్గర ఒక మోటార్ సైకిల్ కనిపించాయని పోలీసులు తెలిపారు. మహిళ తన భర్తతో కలిసి కారు నడుపుతోందని ప్రత్యక్ష సాక్షులు పోలీసులకు తెలిపారు. గాయపడిన వారిని స్థానికులు ఆసుపత్రికి తరలించారు. నవజ్యోత్ సింగ్‌ను జిటిబి నగర్‌లోని న్యూలైఫ్ ఆసుపత్రికి తరలించారు, అక్కడ వైద్యులు ఆయన మృతి చెందినట్లు ప్రకటించారు. ఆయన భార్య చికిత్స పొందుతోంది. ఆమె పరిస్థితి చాలా విషమంగా ఉందని సమాచారం.

గాయపడిన జంటను సమీపంలోని ఆసుపత్రికి ఎందుకు తరలించలేదని, బదులుగా 17 కిలోమీటర్ల దూరంలో ఉన్న GTBలోని ఒక ఆసుపత్రికి ఎందుకు తీసుకెళ్లారని నవజ్యోత్ సింగ్ కుటుంబం ప్రశ్నించింది. ఈ ప్రమాదంలో ఎయిర్‌బ్యాగ్‌లు తెగిపోయి తీవ్రంగా దెబ్బతిన్న BMW కారును స్వాధీనం చేసుకున్నారు. గురుగ్రామ్ నివాసితులైన నిందితులు దంపతులు కూడా గాయపడి ఆసుపత్రిలో చేరారని పోలీసులు తెలిపారు. భర్త ఒక వ్యాపారవేత్త అని చెబుతున్నారు. క్రైమ్ బృందం మరియు ఫోరెన్సిక్ నిపుణులు సంఘటనా స్థలాన్ని పరిశీలించి, చట్టపరమైన చర్యలు తీసుకుంటున్నారు. ఈ కేసులో ఎఫ్ఐఆర్ నమోదు చేస్తున్నట్లు పోలీసులు నిర్ధారించారు.

Next Story