ఘోర ప్రమాదం.. ట్రక్కు ఢీకొట్టడంతో ఏడుగురు మృతి, 10 మందికి గాయాలు

పంజాబ్‌లోని హోషియార్‌పూర్ జిల్లాలోని ఖురల్‌ఘర్ సాహిబ్‌లో బైసాఖీ వేడుకలను జరుపుకోవడానికి వెళుతున్న

By అంజి  Published on  13 April 2023 7:45 AM GMT
Punjab, Hoshiarpur, Road accident

ఘోర ప్రమాదం.. ట్రక్కు ఢీకొట్టడంతో ఏడుగురు మృతి, 10 మందికి గాయాలు

పంజాబ్‌లోని హోషియార్‌పూర్ జిల్లాలోని ఖురల్‌ఘర్ సాహిబ్‌లో బైసాఖీ వేడుకలను జరుపుకోవడానికి వెళుతున్న ఏడుగురు యాత్రికులు రోడ్డు ప్రమాదంలో మృతి చెందారు. గురువారం తెల్లవారుజామున ఖురల్‌ఘర్ సాహిబ్‌లో ట్రక్కు ఢీకొనడంతో ఏడుగురు మరణించగా, పది మంది గాయపడ్డారని పోలీసులు తెలిపారు. మృతులు ఎక్కువగా ఉత్తరప్రదేశ్‌లోని ముజఫర్‌నగర్ జిల్లాలోని మస్తాన్ ఖేరా నివాసితులని గర్హశంకర్ డిప్యూటీ సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ (డీఎస్పీ) దల్జీత్ సింగ్ ఖాఖ్ తెలిపారు.

ప్రమాదం జరిగిన ప్రాంతం ఉప పర్వత ప్రాంతం అని, వాలుపై వెళ్తున్నప్పుడు డ్రైవర్ నియంత్రణ కోల్పోయి కాలినడకన వెళ్తున్న 17 మంది యాత్రికులను ఢీకొట్టినట్లు పోలీసులు తెలిపారు. ట్రక్కు బ్రేకులు ఫెయిలయ్యాయని అనుమానిస్తున్నట్లు పోలీసులు తెలిపారు. మృతులను రాహుల్, సుదేష్ పాల్, సంతోష్, అంగూరి, కుంతి, గీత, రామోలుగా గుర్తించినట్లు డీఎస్పీ తెలిపారు. తీవ్రంగా గాయపడిన వారిలో ఐదుగురిని చండీగఢ్‌లోని పీజీఐఎంఈఆర్‌కు రిఫర్ చేయగా, మిగిలిన వారిని గర్‌శంకర్‌లోని సివిల్ హాస్పిటల్‌లో చేర్చారు.

బైసాఖి పండుగ దృష్ట్యా గురు రవిదాస్‌తో అనుబంధం ఉన్న ఖురల్‌ఘర్ సాహిబ్‌కు యాత్రికులు తరలివస్తున్నారు.

Next Story