లోయలో టూరిస్ట్ వాహనం బోల్తా.. నలుగురు మృతి, 13 మందికి గాయాలు

కేరళలోని ఇడుక్కి జిల్లాలో తమిళనాడుకు చెందిన టూరిస్ట్ వాహనం బోల్తా పడి లోయలో పడి ఒక సంవత్సరం పాప సహా కనీసం నలుగురు వ్యక్తులు మరణించారు.

By అంజి  Published on  20 March 2024 4:58 AM GMT
tourist vehicle, Tamil Nadu , Kerala, Crime news

లోయలో టూరిస్ట్ వాహనం బోల్తా.. నలుగురు మృతి, 13 మందికి గాయాలు

మంగళవారం కేరళలోని ఇడుక్కి జిల్లాలో తమిళనాడుకు చెందిన టూరిస్ట్ వాహనం బోల్తా పడి లోయలో పడి ఒక సంవత్సరం పాప సహా కనీసం నలుగురు వ్యక్తులు మరణించారని పోలీసులు తెలిపారు. ప్రమాదంలో వాహనంలో ఉన్న మరో 13 మంది పర్యాటకులు గాయపడ్డారు. మంగళవారం సాయంత్రం తిరునల్‌వేలి అజంతా ప్రెషర్‌ కుక్కర్‌ కంపెనీ సిబ్బంది, కుటుంబాల కోసం ఏర్పాటు చేసిన ఫ్యామిలీ టూర్‌లో ఈ ప్రమాదం జరిగిందని పోలీసులు తెలిపారు. పర్యాటకులు మున్నార్, అనకులం సందర్శించి తమిళనాడుకు తిరిగి వస్తుండగా ప్రమాదం జరిగింది.

ఈ ప్రమాదంలో మృతి చెందిన వారిని 40 ఏళ్ల అభినేష్ మూర్తి, అభినేష్ ఏడాది కుమారుడు తన్విక్, 71 ఏళ్ల తేని వాసి గుణశేఖరన్, విశాఖ మెటల్ యజమాని ఈరోడ్‌కు చెందిన పికె సేతుగా గుర్తించారు. ప్రస్తుతం 11 మంది ఆదిమాలి తాలూకా ఆసుపత్రిలో చికిత్స పొందుతుండగా, మరో ఇద్దరిని తేని వైద్య కళాశాలకు తరలించారు. మంగళవారం తెల్లవారుజామున, విజింజం అంతర్జాతీయ నౌకాశ్రయానికి రాళ్లను తీసుకెళ్తున్న లారీ నుంచి భారీ రాయి జారి మీదపడి మంగళవారం కేరళలోని తిరువనంతపురంలో ఒక వైద్య విద్యార్థి (27) మరణించినట్లు అధికారులు తెలిపారు.

ట్రక్ డ్రైవర్‌ను అరెస్టు చేశారు. ర్యాష్, నిర్లక్ష్యంగా డ్రైవింగ్ చేసినందుకు ఎఫ్‌ఐఆర్ నమోదు చేయబడింది. ముక్కోలకు చెందిన దంత వైద్య విద్యార్థి అనంతు ఎదురుగా స్కూటర్‌పై వెళుతుండగా బండరాయి ఢీకొనడంతో అదుపు తప్పి పక్కనే ఉన్న ఇంటి గోడను ఢీకొట్టింది.

Next Story