వైద్యుడు అనుమానాస్పద మృతి.. డ్రగ్స్ ఓవర్‌డోసే కారణమా?

ఆల్ ఇండియా ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ (ఎయిమ్స్)లో న్యూరో సర్జన్‌గా పనిచేస్తున్న రాజ్ ఘోనియా ఆదివారం ఆత్మహత్యాయత్నానికి పాల్పడి మరణించారు.

By అంజి
Published on : 19 Aug 2024 9:00 AM IST

AIIMS doctor died, drug overdose, Delhi

వైద్యుడు అనుమానాస్పద మృతి.. డ్రగ్స్ ఓవర్‌డోసే కారణమా?

ఆల్ ఇండియా ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ (ఎయిమ్స్)లో న్యూరో సర్జన్‌గా పనిచేస్తున్న రాజ్ ఘోనియా ఆదివారం ఆత్మహత్యాయత్నానికి పాల్పడి మరణించారు. దక్షిణ ఢిల్లీలోని గౌతమ్ నగర్‌లోని అతని ఇంటిలో అతని మృతదేహం పక్కన కొన్ని వాడిన మందులు, సిరంజిలు కనుగొనబడినందున, డ్రగ్ ఓవర్ డోస్ కారణంగా డాక్టర్ మరణించినట్లు అనుమానిస్తున్నట్లు పోలీసులు తెలిపారు.

ఘోనియా గుజరాత్‌లోని రాజ్‌కోట్‌కు చెందినవారు. ఎయిమ్స్‌లోని ట్రామా సెంటర్‌లో న్యూరోసర్జన్‌గా పనిచేశారు. అతని ఇంటి నుంచి సూసైడ్ నోట్ స్వాధీనం చేసుకున్నామని, ఘోనియా అందులో ఎవరినీ నిందించలేదని పోలీసులు తెలిపారు.

పోలీసు వర్గాలు తెలిపిన వివరాల ప్రకారం.. ఎయిమ్స్ డాక్టర్, ఆయన భార్య మధ్య వివాదం నడుస్తోంది. రక్షాబంధన్ సందర్భంగా అతని భార్య తన ఇంటికి వెళ్లింది. మధ్యాహ్నం 2 గంటల సమయంలో తమకు కాల్ వచ్చిందని, వెంటనే ఘటనా స్థలానికి చేరుకుని చూడగా అపస్మారక స్థితిలో ఉన్న అతడిని గుర్తించామని పోలీసులు తెలిపారు. అతడిని ఎయిమ్స్‌ ఆసుపత్రికి తరలించగా అప్పటికే మృతి చెందినట్లు ప్రకటించారు.

తదుపరి విచారణ కొనసాగుతోందని వారు తెలిపారు.

Next Story