Hyderabad: ఘోర రోడ్డు ప్రమాదం.. ముగ్గురు బాలురు మృతి

జనవరి 28, మంగళవారం తెల్లవారుజామున రాజేంద్రనగర్ సమీపంలోని ఆరామ్‌ఘర్ ఫ్లైఓవర్‌పై జరిగిన మోటార్‌సైకిల్ ప్రమాదంలో ముగ్గురు మైనర్ బాలురు విషాదకరంగా ప్రాణాలు కోల్పోయారు.

By అంజి  Published on  28 Jan 2025 10:17 AM IST
minor boys, bike accident, Hyderabad, Rajendranagar

Hyderabad: ఘోర రోడ్డు ప్రమాదం.. ముగ్గురు బాలురు మృతి

హైదరాబాద్‌: జనవరి 28, మంగళవారం తెల్లవారుజామున రాజేంద్రనగర్ సమీపంలోని ఆరామ్‌ఘర్ ఫ్లైఓవర్‌పై జరిగిన మోటార్‌సైకిల్ ప్రమాదంలో ముగ్గురు మైనర్ బాలురు విషాదకరంగా ప్రాణాలు కోల్పోయారు. తెల్లవారుజామున 2 గంటల ప్రాంతంలో జరిగిన ఈ ఘటనకు ర్యాష్, నిర్లక్ష్యంగా డ్రైవింగ్ కారణమని పోలీసులు అనుమానిస్తున్నారు. నివేదికల ప్రకారం.. ముగ్గురూ బహదూర్‌పురా నుండి ఆరామ్‌ఘర్ వైపు వెళుతుండగా ఈ ప్రమాదం జరిగింది.

మోటార్‌సైకిల్ డ్రైవర్ నియంత్రణ తప్పి ఫ్లైఓవర్ మీడియన్‌ను ఢీకొట్టాడు. దీని ప్రభావంతో ముగ్గురు అబ్బాయిలకు తీవ్ర గాయాలయ్యాయి. వారు సంఘటనా స్థలంలో మరణించారు. ప్రమాదాన్ని గమనించిన ఇతర వాహనదారులు వెంటనే పోలీసులకు సమాచారం అందించారు. ఈ విషాద ఘటనపై రాజేంద్రనగర్ పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. చెట్టంతా ఎదిగిన కొడుకులను కోల్పోవడంతో తల్లిదండ్రులు కన్నీరు మున్నీరుగా విలపిస్తున్నారు.

Next Story