ఉత్తరప్రదేశ్లోని లక్నో మహానగర్ ప్రాంతంలోని అద్దె ఇంట్లో 24 ఏళ్ల మహిళ మృతదేహం లభ్యమైంది. ఈ ఘటన స్థానికంగా కలకలం రేపింది. అనుమానాస్పద మృతిగా కేసు నమోదు చేసిన పోలీసులు.. ఒక వ్యక్తి కోసం వెతుకుతున్నారని గురువారం ఓ అధికారి తెలిపారు. ఈ ఘటనకు సంబంధించి పోలీసులు తెలిపిన వివరాల ఇలా ఉన్నాయి. మృతి చెంది కనిపించిన మహిళ పవన్ అనే 28 ఏళ్ల వ్యక్తికి స్నేహితురాలు. అతడే మహిళను హత్య చేసి ఉంటాడని బాధితురాలి కుటుంబ సభ్యులు ఆరోపిస్తున్నారు.
గొంతు కోసి చంపే ముందు ఆమెపై అత్యాచారం జరిగిందని ఆమె కుటుంబ సభ్యులు ఆరోపించగా, అదనపు డిప్యూటీ కమిషనర్ ఆఫ్ పోలీస్ మనీషా సింగ్ మాట్లాడుతూ.. పోస్ట్మార్టం నివేదికలో మహిళ ఆత్మహత్య చేసుకున్నట్లు నిర్ధారణ అయిందని చెప్పారు. ఇదిలా ఉండగా, బాధితురాలి కుటుంబ సభ్యుల ఫిర్యాదు ఆధారంగా పోలీసులు పవన్పై ఎఫ్ఐఆర్ నమోదు చేశారు. "బుధవారం జరిగిన సంఘటన నుండి నిందితుడు పరారీలో ఉన్నాడు. అతన్ని అరెస్టు చేయడానికి ప్రయత్నాలు జరుగుతున్నాయి" అని అధికారి ధృవీకరించారు.