దుబాయ్‌లో దారుణం.. ఇద్దరు తెలంగాణ వ్యక్తులను నరికి చంపిన పాకిస్థానీ

దుబాయ్‌లో దారుణ ఘటన చోటు చేసుకుంది. తెలంగాణ రాష్ట్రానికి చెందిన ఇద్దరు వ్యక్తులను ఓ పాకిస్థానీ నరికి చంపాడు.

By అంజి
Published on : 15 April 2025 10:42 AM IST

2 Telangana men killed, injured , Pakistani man, Dubai, Crime

దుబాయ్‌లో దారుణం.. ఇద్దరు తెలంగాణ వ్యక్తులను నరికి చంపిన పాకిస్థానీ

దుబాయ్‌లో దారుణ ఘటన చోటు చేసుకుంది. తెలంగాణ రాష్ట్రానికి చెందిన ఇద్దరు వ్యక్తులను ఓ పాకిస్థానీ నరికి చంపాడు. నిర్మల్‌ జిల్లా సోన్‌కు చెందిన అష్టపు ప్రేమ్‌ సాగర్‌ (40), నిజామాబాద్ జిల్లాకు చెందిన శ్రీనివాస్‌ దుబాయ్‌లోని ఓ ఫేమస్‌ బేకరీలో పని చేస్తున్నారు. అదే బేకరీలో పని చేసే ఓ పాకిస్థానీ మత విద్వేషంతో వీరిద్దరిని దారుణంగా నరికి చంపాడు. ఈ ఘటనలో మరో ఇద్దరు తెలుగు వారు గాయపడినట్టు సమాచారం. గత శుక్రవారం నాడు ఈ ఘటన జరగ్గా ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది.

ఆంధ్రజ్యోతి నివేదిక ప్రకారం , దాడి చేసిన వ్యక్తి, పాకిస్తాన్ జాతీయుడు, పని వేళల్లో హింసాత్మక దాడికి పాల్పడ్డాడు. బాధితులను కత్తితో పొడిచిన తర్వాత, అతను మతపరమైన నినాదాలు చేశాడని, మతపరమైన ఉద్దేశ్యాల అనుమానాలను లేవనెత్తిందని తెలుస్తోంది. గాయపడిన కార్మికులు ప్రస్తుతం కోలుకుంటున్నారు, అయితే వారి పరిస్థితి విషమంగా ఉంది. ఈ ఘటనకు సంబంధించి మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.

Next Story