ఫోన్ ఎక్కువ చూస్తున్నావని మందలించిన తండ్రి.. ఊహించని నిర్ణయం తీసుకున్న 19 ఏళ్ల యువతి

పూణె జిల్లాలోని ఘోడేగావ్‌లో 19 ఏళ్ల యువతి తన ఇంటి టెర్రస్‌పై నుంచి దూకి ఆత్మహత్య చేసుకుంది. చదువుకోకుండా

By న్యూస్‌మీటర్ తెలుగు  Published on  11 May 2023 8:00 AM GMT
Crime news, Pune, suicide, phone

ఫోన్ ఎక్కువ చూస్తున్నావని మందలించిన తండ్రి.. ఊహించని నిర్ణయం తీసుకున్న 19 ఏళ్ల యువతి

పూణె జిల్లాలోని ఘోడేగావ్‌లో 19 ఏళ్ల యువతి తన ఇంటి టెర్రస్‌పై నుంచి దూకి ఆత్మహత్య చేసుకుంది. చదువుకోకుండా ఎక్కువ సమయం ఫోన్‌లో గడుపుతున్నందుకు బాలిక తండ్రి ఆమెను మందలించాడని పోలీసులు తెలిపారు. దీంతో ఆ అమ్మాయి క్షణికావేశంలో ఆమె టెర్రస్ పైకి ఎక్కి దూకింది.మంగళవారం ఉదయం బాలిక మృతదేహం కనిపించింది. వెంటనే ఆమెను సమీపంలోని ఆసుపత్రికి తరలించగా, అప్పటికే ఆమె మృతి చెందినట్లు వైద్యులు నిర్ధారించారు.

ఘోడేగావ్ పోలీస్ స్టేషన్‌లో పోలీసులు ప్రమాదవశాత్తు మృతి కింద కేసును నమోదు చేశారు. బాలిక మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం తరలించారు. చనిపోయిన అమ్మాయి 12వ తరగతి చదువుతూ ఉంది. ఆమె ఒక్కతే సంతానం. ఆమె తండ్రి వ్యాపారవేత్త, ఆమె తల్లి గృహిణి. ఈ ఘటన ఆ దంపతులకు తీరని విషాదాన్ని నింపింది. ఈ ఘటనపై పోలీసులు మరింత లోతుగా దర్యాప్తు చేస్తున్నారు.

- ఎవరైనా మానసిక ఆరోగ్య సమస్యలను ఎదుర్కొంటున్నట్లు లేదా ఆత్మహత్యకు పాల్పడుతున్నట్లు మీకు తెలిస్తే, దయచేసి సహాయం అందించండి. వ్యక్తులు, కుటుంబాలకు భావోద్వేగ మద్దతును అందించే ఆత్మహత్య-నివారణ సంస్థల యొక్క కొన్ని హెల్ప్‌లైన్ నంబర్‌లు ఇక్కడ ఉన్నాయి. కాల్- 9152987821, AASRA-9820466726, రోష్ని ట్రస్ట్- 040-66202000.

Next Story