లోయలో పడ్డ బస్సు.. 10 మంది మృతి, 55 మందికి గాయాలు

జమ్మూ - కాశ్మీర్‌లో ఘోర ప్రమాదం జరిగింది. ఝజ్జర్ కోట్లి సమీపంలోని జమ్మూ-శ్రీనగర్ జాతీయ రహదారిపై మంగళవారం బస్సు లోయలో

By అంజి  Published on  30 May 2023 10:13 AM IST
Jammu Srinagar National Highway, Katra, accident

లోయలో పడ్డ బస్సు.. 10 మంది మృతి, 55 మందికి గాయాలు

జమ్మూ - కాశ్మీర్‌లో ఘోర ప్రమాదం జరిగింది. ఝజ్జర్ కోట్లి సమీపంలోని జమ్మూ-శ్రీనగర్ జాతీయ రహదారిపై మంగళవారం బస్సు లోయలో పడిపోవడంతో పది మంది మృతి చెందగా, మరో 55 మంది గాయపడ్డారు. ప్రమాదం జరిగిన సమయంలో 75 మంది ప్రయాణికులతో బస్సు అమృత్‌సర్‌ నుంచి కత్రాకు వెళ్తోంది. బస్సులో ఓవర్‌లోడ్‌ ఉందని, నిర్దేశించిన పరిమితి కంటే ఎక్కువ మంది ప్రయాణికులను తీసుకెళ్తున్నారని జమ్మూ ఎస్‌ఎస్పీ చందన్ కోహ్లీ తెలిపారు. మరణించిన పది మంది బీహార్‌కు చెందిన వారని పోలీసులు తెలిపారు.

"పది మంది మరణించారు. దాదాపు 55 మంది గాయపడ్డారు. అందరూ బస్సు ఉండి ఖాళీ చేయబడ్డారు. రెస్క్యూ ఆపరేషన్ దాదాపు పూర్తయింది. ఒక ఎస్‌డీఆర్‌ఎఫ్‌ బృందం కూడా అక్కడే ఉంది. బస్సులో నిర్ణీత పరిమితి కంటే ఎక్కువ మంది ప్రయాణికులు ఉన్నారు. విచారణ సమయంలో దర్యాప్తు చేయబడుతుంది" ఎస్‌ఎస్‌పీ చెప్పారు. ప్రమాదానికి గురైన బస్సులో ఉన్న ప్రయాణికులు బీహార్‌కు చెందినవారని పోలీసులు తెలిపారు. ప్రమాదం జరిగిన సమయంలో కుటుంబంలోని సన్నిహితులు, ప్రియమైన వారందరూ వారితో పాటు కత్రాకు వెళుతున్నారు.

'ముండన్' వేడుక తర్వాత, వారు మాతా వైష్ణో దేవి మందిరానికి యాత్రను చేపట్టాలని యోచించారని వారు తెలిపారు. గాయపడిన వారిని చికిత్స నిమిత్తం జమ్మూలోని ఆసుపత్రికి తరలించారు. జమ్మూ కాశ్మీర్ లెఫ్టినెంట్ గవర్నర్ మనోజ్ సిన్హా మాట్లాడుతూ.. ప్రమాదంలో మరణించిన వారి గురించి విని చాలా బాధపడ్డాను. క్షతగాత్రులకు అవసరమైన అన్ని సహాయాలు అందించాలని జిల్లా యంత్రాంగాన్ని ఆదేశించినట్లు తెలిపారు.

ఈ ఘటనపై జమ్మూ కాశ్మీర్ లెఫ్టినెంట్ గవర్నర్ కార్యాలయం ట్వీట్‌ చేసింది. "జమ్మూలోని ఝజ్జర్ కోట్లిలో జరిగిన ఘోర బస్సు ప్రమాదంలో ప్రాణాలు కోల్పోవడం చాలా బాధాకరం. మృతుల కుటుంబాలకు నా హృదయపూర్వక సానుభూతి, క్షతగాత్రులు త్వరగా కోలుకోవాలని ప్రార్థిస్తున్నాను. గాయపడిన వారికి అన్ని విధాలా సహాయం, చికిత్స అందించాలని జిల్లా అధికార యంత్రాంగాన్ని ఆదేశించింది.''

Next Story