తెలంగాణలో 60వేల పాజిటివ్‌ కేసులు.. 500 దాటిన మృతుల సంఖ్య

By తోట‌ వంశీ కుమార్‌  Published on  30 July 2020 5:20 AM GMT
తెలంగాణలో 60వేల పాజిటివ్‌ కేసులు.. 500 దాటిన మృతుల సంఖ్య

తెలంగాణలో కరోనా ఉద్దృతి కొనసాగుతోంది. నిన్న(బుధవారం 29న) 18,263 శాంపిల్స్‌ను పరీక్షించగా..కొత్తగా మరో 1,811 కరోనా పాజిటివ్‌ కేసులు నమోదు కాగా.. 13 మంది ప్రాణాలు కోల్పోయినట్లు వైద్య ఆరోగ్య శాఖ విడుదల చేసిన బులెటిన్‌లో పేర్కొంది. వీటితో కలిపి రాష్ట్రంలో కరోనా పాజిటివ్‌ కేసులు సంఖ్య 60,717కి చేరింది. ఈ మహమ్మారి బారీన పడి 505 మంది మృత్యువాత పడ్డారు. తాజాగా 821 మంది క‌రోనా నుంచి కోలుకుని ఆస్ప‌త్రుల నుంచి డిశ్చార్జ్ అయ్యారు. దీంతో.. ఇప్ప‌టి వ‌ర‌కు కోలుకున్న వారి సంఖ్య 45,572కి చేరింది. 15,640 మంది ఆస్పత్రుల్లో చికిత్స పొందుతున్నారు.

ఏ జిల్లాలో ఎన్ని కేసులు అంటే..

ఆదిలాబాద్‌ – 18

భద్రాద్రి కొత్తగూడెం- 27

జీహెచ్‌ఎంసీ -521

జగిత్యాల-15

జనగాం- 22

జయశంకర్‌ భూపాలపల్లి – 20

జోగులాంబ గద్వాల -28

కామారెడ్డి -11

కరీంనగర్‌ -97

ఖమ్మం -26

ఆసిఫాబాద్‌ -6

మహబూబ్‌ నగర్‌ -41

మహబూబాబాద్‌ -39

మంచిర్యాల- 18

మెదక్‌ – 15

మేడ్చల్‌ మల్కాజ్‌గిరి – 151

ములుగు –16

నాగర్‌కర్నూల్‌ – 9

నల్లగొండ – 61

నారాయణపేట -9

నిర్మల్‌ -12

నిజామాబాద్‌ –44

పెద్దపల్లి -21

రాజన్న సిరిసిల్ల -30

రంగారెడ్డి -289

సంగారెడ్డి -33

సిద్దిపేట – 24

సూర్యాపేట-37

వికారాబాద్‌-12

వనపర్తి – 23

వరంగల్‌ రూరల్‌ -18

వరంగల్‌ అర్భన్‌ -102

యాదాద్రి భువనగిరి -16



Next Story