భారత్‌లో కరోనా విలయతాండవం.. ఒక్క రోజే 62,538 పాజిటివ్‌ కేసులు

By తోట‌ వంశీ కుమార్‌  Published on  7 Aug 2020 5:47 AM GMT
భారత్‌లో కరోనా విలయతాండవం.. ఒక్క రోజే 62,538 పాజిటివ్‌ కేసులు

భారత్‌లో కరోనా మహమ్మారి విజృంభిస్తోంది. గత కొద్ది రోజులుగా నిత్యం 50వేలకు పైగా పాజిటివ్‌ కేసులు నమోదు అవుతున్నాయి. గడిచిన 24 గంటల్లో 62,538 పాజిటివ్‌ కేసులు నమోదు కాగా.. 886 మృత్యువాత పడ్డారని కేంద్ర, ఆరోగ్య కుటుంబ సంక్షేమ శాఖ వెల్లడించింది. భారత్‌లో కరోనా వ్యాప్తి మొదలైన తరువాత ఒక రోజు వ్యవధిలో నమోదు అయిన అత్యధిక కరోనా కేసులు ఇవే. వీటితో కలిపి దేశంలో కరోనా పాజిటివ్‌ కేసుల సంఖ్య 20,27,034కి చేరింది. మొత్తం నమోదు అయిన కేసుల్లో 13,78,106 మంది కోలుకుని డిశ్చార్జి కాగా.. 6,07,384 మంది వివిధ ఆస్పత్రుల్లో చికిత్స పొందుతున్నారు.

ఈ మహమ్మారి భారీన పడి ఇప్పటి వరకు 41,458 మంది ప్రాణాలు కోల్పోయారు. దేశంలో రికవరీ రేటు 68 శాతం ఉండగా.. మరణాల రేటు 2.07శాతంగా ఉంది. నిన్న ఒక్కరోజులో 5,74,783 శాంపిళ్లను పరీక్షించగా.. మొత్తంగా ఇప్పటి వరకు 2,27,24,134 కరోనా పరీక్షలు నిర్వహించినట్లు భారతీయ వైద్య పరిశోధన మండలి (ఐసీఎంఆర్) తెలిపింది. ఇక ప్రపంచ వ్యాప్తంగా అత్యధిక కరోనా కేసులు నమోదు అవుతున్న దేశాల్లో భారత్‌ మూడో స్థానంలో ఉండగా.. అత్యధిక మరణాలు నమోదు అవుతున్న దేశాల్లో ఆరో స్థానంలో కొనసాగుతోంది.

Next Story