ఏపీలో రెండున్నర లక్షలు దాటిన కరోనా పాజిటివ్‌ కేసులు

By తోట‌ వంశీ కుమార్‌  Published on  12 Aug 2020 12:35 PM GMT
ఏపీలో రెండున్నర లక్షలు దాటిన కరోనా పాజిటివ్‌ కేసులు

ఆంధ్రప్రదేశ్‌లో కరోనా మహమ్మారి విజృంభణ కొనసాగుతోంది. రాష్ట్రంలో పాజిటివ్‌ కేసుల సంఖ్య రెండున్నర లక్షలు దాటింది. గడిచిన 24గంటల్లో 57,148 శాంపిల్స్‌ను పరీక్షించగా.. 9,597 పాజిటివ్‌ కేసులు నమోదు అయినట్లు రాష్ట్ర వైద్య, ఆరోగ్య శాఖ బులిటెన్‌లో వెల్లడించింది. వీటితో కలిపి రాష్ట్రంలో పాజిటివ్‌ కేసుల సంఖ్య 2,54,146కి చేరింది.

కొవిడ్‌ వల్ల గుంటూరులో పదమూడు మంది, ప్రకాశంలో పదకొండు మంది, చిత్తూరులో పది మంది, నెల్లూరులో పది మంది, శ్రీకాకుళంలో తొమ్మిది మంది, అనంతపూర్‌లో ఏడుగురు, కడపలో ఏడుగురు, విశాఖపట్నంలో ఆరుగురు, తూర్పుగోదావరిలో ఐదుగురు, విజయనగరంలో ఐదుగురు, కర్నూల్‌లో నలుగురు, పశ్చిమగోదావరిలో నలుగురు, కృష్ణలో ఇద్దరు 93మంది మరణించారు. దీంతో రాష్ట్రంలో మృతుల సంఖ్య 2296 కి చేరింది. మొత్తం నమోదు అయిన కేసుల్లో ఇప్పటి వరకు 1,61,425 మంది కోలుకుని, డిశ్చార్జి కాగా.. 90,425 మంది చికిత్స పొందుతున్నారు.

కొత్తగా నమోదైన కేసులు.. జిల్లాల వారిగా..

అనంతపురంలో 781,

చిత్తూరులో 1235,

ఈస్ట్‌ గోదావరిలో 1332,

గుంటూరులో 762,

కడపలో 364,

కృష్ణలో 335,

కర్నూలులో 781,

నెల్లూరులో 723,

ప్రకాశంలో 454,

శ్రీకాకుంలో 511,

విశాఖపట్నంలో 797,

విజయనగరంలో 593,

పశ్చిమ గోదావరిలో 929 చొప్పున కేసులు నమోదు అయ్యాయి.



Next Story