ఆన్లైన్ గ్యాంబ్లింగ్పై సెలబ్రిటీలకు హైకోర్టు నోటీసులు
By న్యూస్మీటర్ తెలుగు Published on 3 Nov 2020 2:36 PM GMTసెలబ్రిటీలకు ఆన్లైన్ గ్యాంబ్లింగ్పై మద్రాస్ హైకోర్టు నోటీసులు జారీ చేసింది. గ్యాంబ్లింగ్కు అనుకూల ప్రకటనల్లో నటించిన క్రికెటర్లు విరాట్ కొహ్లి, సౌరవ్ గంగూలీ, సినీ నటులు దగ్గుపాటి రానా, సుదీప్, ప్రకాశ్ రాజ్లకు హైకోర్టు నోటీసులు జారీ చేసింది. ఈ నెల 19లోగా సమాధానం ఇవ్వాలని మద్రాస్ హైకోర్టు ఆదేశించింది.
ఆన్లైన్ గ్యాంబ్లింగ్ కు వ్యతిరేకంగా దాఖలైన పిటిషన్ పై మద్రాస్ హైకోర్టు ఈ రోజు విచారణ జరిపింది. ఆన్లైన్ గ్యాంబ్లింగ్లో వందలాది మంది డబ్బులు పొగొట్టుకున్నారని పిటీషనర్ తెలిపాడు. విచారణ చేపట్టిన హైకోర్టు.. ఆన్లైన్ గ్యాంబ్లింగ్కు మద్దతుగా ప్రకటనల్లో నటించిన సెలబ్రిటీలకు నోటీసులు అందించింది. ఈ ప్రకటనల్లో ఎందుకు నటించాల్సి వచ్చిందో ఈ నెల 19లోగా సమాధానం ఇవ్వాలని ఆదేశించింది.
Next Story