భారత్‌లో 45లక్షలు దాటిన కరోనా కేసులు

By తోట‌ వంశీ కుమార్‌  Published on  11 Sep 2020 5:10 AM GMT
భారత్‌లో 45లక్షలు దాటిన కరోనా కేసులు

భారత్‌లో కరోనా మహమ్మారి విలయతాండవం కొనసాగుతోంది. గత కొద్ది రోజులుగా నిత్యం రికార్డు స్థాయిలో పాజిటివ్‌ కేసులు నమోదు అవుతున్నాయి. గడిచిన 24గంటల్లో అత్యధికంగా 96,551 పాజిటివ్‌ కేసులు నమోదు అయినట్లు కేంద్ర వైద్య, ఆరోగ్య మంత్రిత్వ శాఖ వెల్లడించింది. దీంతో దేశంలో కరోనా పాజిటివ్‌ కేసుల సంఖ్య 45,62,451కి చేరింది. మొత్తం నమోదు అయిన కేసుల్లో 35,42,664 మంది కోలుకోగా.. ప్రస్తుతం 9,43,480 యాక్టివ్‌ కేసులు ఉన్నాయి.

నిన్న ఒక్క రోజే 1209 మంది ప్రాణాలు కోల్పోయారు. ఈ మహమ్మారి బారిన పడి ఇప్పటి వరకు 76,271 మంది మృత్యువాత పడ్డారు. దేశంలో కరోనా బాధితుల రికవరీ రేటు 77శాతం ఉండగా.. మరణాల రేటు 1.67శాతంగా ఉంది. నిన్న ఒక్క రోజే 11,63,542 శాంపిళ్లను పరీక్షించగా.. మొత్తంగా 5,40,97,975 కరోనా పరీక్షలు నిర్వహించినట్లు భారతీయ వైద్య పరిశోధన మండలి (ఐసీఎంఆర్) తెలిపింది. ప్రపంచ వ్యాప్తంగా అత్యధిక కరోనా పాజిటివ్‌ కేసులు నమోదు అవుతున్న దేశాల్లో భారత్‌ రెండో స్థానంలో ఉంది.

Next Story